'అందాల రాక్షసి' సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఈ  సినిమా లో తన క్యూట్ నెస్ తో  మెప్పించింది లావణ్య.   ప్రస్తుతం ఈ భామ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అభినయానికి మంచి పాత్రలు, మూవీల్లో నటిస్తున్నారు.  అయితే నాని నటించిన 'భలే భలే మగాడివోయ్' సినిమాతో హిట్ అందుకున్న పెద్ద హీరోల సరసన అమ్మడికి ఛాన్స్ రాలేదు. నాగార్జున సరసన 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా చేసిన ఆ క్రెడిట్ అంతా నాగ్ కె వెళ్లిపోయింది. దాంతో లావణ్యను అంతగా పట్టించుకోలేదు.  దాంతో గ్లామర్ పాత్రలకు సై అంటుంది ఈ బ్యూటీ. లావణ్య త్రిపాఠికి ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో నటిస్తుంది. 

 

అయితే ఒక్కపుడు హీరోయిన్లు మడికట్టుకొని స్కిన్ షో చేయకుండా ఉండటంతో పెద్దగా కలిసి రాలేదన్న విషయం ఈ అమ్మడికి తెలిసిందో ఏమో కానీ ఇక నుంచి గ్లామర్ పాత్రలకు సై అంటుంది. ఓ వైపు కొత్త భామలు టాలీవుడ్ కు పరిచయం అవుతున్న నేపథ్యంలో అమ్మడు తన అందానికి సాన పెట్టె పనిలోపడింది. ఇప్పటివరకు అమ్మడు అంతగా స్కిన్ షో చెయ్యలేదు. అర్జున్ సురవరం తర్వాత ఈ బ్యూటికి ఆఫర్లు తగ్గిపోయాయి.  దాంతో ఇక పై అందాల ఆరబోతకు హద్దులు చెరపాలని నిర్ణయించుకుందట. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తుంది.

 

ఇవి చూసైనా స్టార్ హీరోలు అమ్మడికి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.  ప్రస్తుతం   ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’లో లావణ్యా త్రిపాఠి నటిస్తున్నారు. అందులో సందీప్ కిషన్ సరసన ఆమె కనిపించనున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో ఆమెది హాకీ క్రీడాకారిణి పాత్ర. సినిమా కోసం కొన్ని రోజులు హాకీలో శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో నటిస్తున్నారు. ‘భలే భలే మగాడివోయ్’, ‘శ్రీరస్తు శుభమస్తు’ విజయాల తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో ఆమెకు హ్యాట్రిక్ సినిమా.  మరి ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: