నట సింహ బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా అయ్యారు. ఈ మధ్య బాలకృష్ణ దూకుడు పెంచడం తో అభిమానుల్లో ఉత్సాహం బాగా పెరిగింది. ఒకే తరహా చిత్రాలు కాకుండా సినిమా సినిమాకు వేరియేషన్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు బాలకృష్ణ. మాస్, క్లాస్ రెండింటికీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సినిమా కోసం డిఫెరెంట్ గెటప్ లతో ఆయన అభిమానుల్ని అలరిస్తున్నారు. బాలకృష్ణ కు ప్రయోగాలు చేయడం కొత్తేమీ కాదు సినిమా కోసం దర్శకుడు కోరినట్టు తనను మార్చుకుంటారు అని కితాబు ఇస్తున్నారు ఆయన అభిమానులు. 

 

గత ఏడాది చివరిలో డిసెంబర్ నెలలో కే ఎస్ రవికుమార్ దర్శకత్వం లో వచ్చిన రూలర్ సినిమా ఊహించినంత గా ఆడకపోయినా ఆ చిత్రంలో బాలకృష్ణ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో పాత్ర కోసం బాలకృష్ణ తన శరీరాకృతిని మార్చుకున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 12 కిలోల బరువు తగ్గిన బాలకృష్ణ ఈ మూవీలో పాటలకు కుర్ర హీరో లతో పోటీ పడి స్టెప్పులేసారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలకృష్ణ పూరి జగన్నాథ్ సినిమాలో అతిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. బాలకృష్ణ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన సినిమా పైసావసుల్. బాలకృష్ణ అభిమానులకు మాత్రమే అన్న టాగ్ లైన్ తో,

 

రిలీజ్ అయిన ఈ సినిమా ఫలితం తో సంబంధం లేకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మరో సినిమా చేసే అవకాశాన్ని ఇస్తానని బాలకృష్ణ పూరీ జగన్నాథ్ తో చెప్పారట. ఇప్పుడు ఆ అవకాశాన్ని బాలకృష్ణ పూరీ జగన్నాథ్ కి ఇచ్చారని వీరి కాంబినేషన్లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అని ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న టాక్. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నారు. రూలర్ తర్వాత రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా పై బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కారణం గతంలో బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: