అనుష్క సినిమా ఇండస్ట్రీలోకొచ్చి 15 ఏళ్ళు అవుతోంది. నాగార్జున, సోనూ సూద్ హీరోలుగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది అనుష్క. ఈ సినిమాలో ఆయోషా టాకియా కూడా హీరోయిన్ గా నటించింది. కానీ ఇప్పుడు తనెక్కడుందో ఎవరీకి తెలీదు. కానీ అనుష్క మాత్రం ఈ పదినేళ్ళలో ఎన్నో మంచి పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. అరుంధతి సినిమా నుండి అనుష్క ఫేట్ మొత్తం మారిపోయింది. దాంతో అప్పటినుంచి అనుష్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. 

 

ఇక ప్రస్తుతం 'నిశబ్ధం' సినిమా చేస్తుంది. ఈ సినిమా వచ్చే నెల 2న థియేటర్స్ లోకి రాబోతుంది. సంవత్సరం పైగా సమయం తీసుకున్న అనుష్క 'నిశబ్ధం' తో ఇప్పుడు సందడి చేయబోతోంది. దాంతో ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంత వరకూ ఈ సినిమాకు సంబంధించి ఒక్క ప్రమోషన్స్ కి పాల్గొనని అనుష్క ఇప్పటి నుంచి జరిగే ప్రమోషనల్ కార్యక్రమాలలో సందడి చేయబోతోంది. అంతేకాదు 'నిశబ్ధం' సినిమా యూనిట్ అనుష్క పదిహేనేళ్ళ కెరీర్ ను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని మొదలెట్టారు. ట్రైడెంట్ హోటల్ లో జరగనున్న 'నిశబ్ధం' వేడుకలో టాలీవుడ్ సెలెబ్రిటీస్ చాలా మంది హాజరుకానున్నారు.

 

అనుష్క ను లాంచ్ చేసిన పూరి జగన్నాథ్ నుండి ఆమె పనిచేసిన మిగతా దర్శకులు హీరోలు. నిర్మాతలు కూడా హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే 'నిశబ్ధం' సినిమా తర్వాత నటిస్తున్న సినిమా ఏంటనేది ఇంకా క్లారిటి లేదు. అంతేకాదు గత రెండేళ్ళుగా అనుష్క జోరు పూర్తిగా తగ్గిపోయింది. దాంతో అనుష్క కి అవకాశాలు రావడం లేదా అంటూ అనుమానాలొస్తున్నాయి. ఇక కొంతమందేమో 'నిశబ్ధం' గనక సక్సస్ కాకపోతే ఇక అనుష్క కి ఇదే చివరి సినిమా అని కూడా కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: