తెలుగు ఇండస్ట్రీలో విలన్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోలుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు.  ఒకప్పుడు చిరంజీవి, రజినీకాంత్, శ్రీకాంత్ వీళ్లంతా మొదట విలన్ గా కెరీర్ ప్రారంభించి తర్వాత హీరోలుగా మారిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో ప్రముఖ విప్లవ డైరెక్టర్ టి కృష్ణ తనయుడు గోపిచంద్ మొదట హీరోగా పరిచయం అయినా తర్వాత విలన్ గా నటించాడు.  ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు.  తాజాగా గోపీచంద్ - సంపత్ నంది కాంబినేషన్లో గతంలో వచ్చిన 'గౌతమ్ నంద' చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా తనతో మరో సినిమా చేసే అవకాశాన్ని గోపీచంద్ కల్పించాడు. 

 

గౌతమ్ నందాలో గోపిచంద్ ద్విపాత్రాభినయంలో కనిపించాడు.  కంటెంట్ బాగున్నా.. ఈ మూవీ కమర్షియల్ హిట్ మాత్రం కాలేక పోయింది.  తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో 'సీటీమార్' చిత్రం రూపొందుతోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ సినిమాలో, గోపీచంద్ సరసన తమన్నా నటిస్తోంది. ఈ ఇద్దరూ కూడా ఈ చిత్రం కబడ్డీ కోచ్ లు గా కనిపించనున్నారు.   తాజాగా ఈ చిత్రంలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కి ప్లాన్ చేశారట. 

 

ట్రైన్ లో ఈ యాక్షన్ సీన్లు చిత్రీకరించబోతున్నారట. గోపీచంద్ తో పాటు తమన్నా కూడా ఈ యాక్షన్ సీన్స్ లో పాల్గొంటోంది. ఈ ట్రైన్ ఎపిసోడ్సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా, తనకి తప్పకుండా హిట్ ను ఇస్తుందనే నమ్మకంతో గోపీచంద్ వున్నాడని అంటున్నారు.  అయితే ఈ చిత్రం లో గోపి చంద్ ని సరికొత్త గా చూపించబోతున్నాడట.   ఇక తమన్నా కూడా ఈ చిత్రంలో ఓ కోచ్ గా దుమ్మురేపబోతుందట.  మరి ఈ చిత్రం గోపిచంద్ కు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: