రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జాన్. యు.వి.క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై అత్యంత భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుస విజయాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ సినిమా, అతి త్వరలో యూరప్ లో జరిగే భారీ షెడ్యూల్ కోసం సిద్ధమౌతోంది. సీనియర్ నటుడు కృష్ణంరాజు ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని 2021 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. 

 

ఇక మరోవైపు అక్కినేని అఖిల్ హీరోగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. దాదాపుగా ఎనిమిదేళ్ల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ రెండు సినిమాల షూటింగ్ ల వలన నటి పూజా హెగ్డే కాల్ షీట్స్ లో కొంత క్లాష్ ఏర్పడిందని, దానివలన అదే సమయంలో అఖిల్ సినిమాలో షూటింగ్ లో పాల్గొనాలో లేక ప్రభాస్ సినిమా షూట్ లో పాల్గొనాలో ఆమెకు అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. 

 

నిజానికి దాదాపుగా రెండు సినిమాలకు ఆమె ఒకేసారి సైన్ చేశారని, తన కెరీర్ కు ప్రతి ఒక్క సినిమానే ఇంపార్టెంట్ కాబట్టి, అతి త్వరలో వీలు చూసుకుని రెండు సినిమాల్లోనూ డేట్స్ మిస్సవకుండా జాయిన్ అవుతానని ఆమె మాట ఇచ్చిందట. ఈ విధంగా పూజా హెగ్డే ఓ వైపు ప్రభాస్, మరోవైపు అఖిల్ ల మధ్య చిచ్చు పెట్టిందన అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తపై పూర్తి నిజా నిజాలు మాత్రం వెల్లడి కావాల్సి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: