భారతదేశంలోనే టాప్ డైరెక్టర్ అయిన ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' పైన దేశం మొత్తం భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే రాజమౌళికి సినిమాలు తీసేందుకు చాలా సమయం తీసుకుంటారని ఒక చెడ్డ పేరు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాహుబలి సిరీస్ ను కూడా ముందే డేట్స్ లాక్ చేసుకున్నాక రెండు భాగాలను పోస్ట్ పోన్ చేయడం ఆయనను విమర్శల పాలు చేసింది. అయితే ఇప్పుడు ఇదే అదనుగా కొంతమంది కుర్ర హీరోలు దీనిని అలుసుగా తీసుకొని రాజమౌళి ని టార్గెట్ చేశారు.

 

ముందుగా ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా  సంవత్సరం పెద్దగా సినిమాలు రిలీజ్ కాని సమయం చూసి జూలై 30 డేట్ లాక్ చేసుకున్నారు. అయితే షూటింగ్ చాలా లేటుగా ప్రారంభం అయ్యే సరికి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో చిత్రాన్ని రాజమౌళి నిలిపాడు. అయితే ఎలాగూ చిత్రం వాయిదా అవుతుంది అని అనుకున్నారో ఏమో కానీ ఇద్దరు మంచి కుర్రహీరోలు రాజమౌళి సినిమా అంటే లెక్క లేకుండా అదే సమయానికి తమ చిత్రాలను బరిలోకి దింపుతున్నారు.

 

ఇప్పటికే నితిన్ తన 'రంగ్ దే చిత్రం' కోసం తేదీని లాక్ చేసినట్లు సమాచారం. మరోవైపు వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న చిత్రం కూడా జనవరి 10 తేదీన రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడట. అలాగే మరో ఐదు నెలలు ఉండటంతో నిర్మాతలు అల్లు వెంకటేష్ డేట్ ను లాక్ చేసుకునే పనిలో ఉన్నారట.

 

అయితే ఇక్కడ వారు రెండు రకాలుగా ఆలోచించి ఉండొచ్చు. ఇప్పటివరకు ఒక్క సారి కూడా తన కెరీర్ లో ఫ్లాప్ కాని రాజమౌళి కి ఒక్కసారిగా ఎదురుదెబ్బ తగిలితే వారు సంక్రాంతి సీజన్లో వసూళ్ళ పంట పండించుకోవచ్చు. ఇదే విషయాన్ని సంవత్సరం సంక్రాంతి లో వారు గమనించారు కూడా. ఇంకా ఎక్కువ అంటే చిత్రం వాయిదా పడే అవకాశాలు 90 శాతం ఉన్నాయి. కాబట్టి సంక్రాంతిని సోలోగా ఏలుకోవచ్చు. ఏదైనా రాజమౌళి ని టార్గెట్ చేయడం అంటే పులితో పేకాట ఆడినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: