ఏప్రిల్ 2న విడుదల కాబోతున్న ‘నిశ్శబ్దం’ మూవీ ప్రమోషన్ ఇంకా ప్రారంభం కాకుండానే అనుష్క మ్యానియా పెంచడానికి ఒక భారీ ఈవెంట్ భాగ్యనగరంలో జరగబోతోంది. ఈ ఈవెంట్ ను కోన వెంకట్ నిర్వహిస్తున్నట్లు టాక్. అనుష్క ఇండస్ట్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ ఈవంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు చాలామంది దర్శకులను హీరోలను ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి.

 

సాధారణంగా హీరోలకు ఇలాంటి ఈ ఈవెంట్స్ ను నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ ను ఎంజాయ్ చేస్తున్న అనుష్కకు ఈ ఈవెంట్ నిర్వహించడం వెనుక కారణం ఏమిటి అంటూ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 


హీరోయిన్ గా అనుష్కకు మొదటి అవకాశం ఇచ్చిన పూరీ జగన్నాథ్ నుండి అనుష్కను నేషనల్ సెలెబ్రెటీగా మార్చిన రాజమౌళి వరకు అనేకమంది దర్శకులు ఈ ఈవెంట్ కు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుష్క మొదటి సినిమాలో హీరోగా నటించిన నాగార్జునఈవెంట్ కు ముఖ్య అతిధిగా రాబోతున్నాడు. ఈ ఈవెంట్ భాగ్యనగరంలోని ట్రైడెంట్ హోటల్ లో జరగబోతోంది. 

 

అయితే ప్రస్తుతం యూరప్ లో ఉన్న ప్రభాస్ మాత్రం ఈ ఫంక్షన్ కు రాలేని పరిస్థితి. దక్షిణాది సినిమా రంగంలో నయన తార తరువాత అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగిన అనుష్క స్థాయికి తగ్గట్టుగా ఈ ఫంక్షన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా అనుష్క రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ ను పెళ్ళి చేసుకోబోతోంది అని గాసిప్పులు వచ్చిన తరువాత అనుష్క పాల్గొంటున్న మొదటి ఫంక్షన్ కావడంతో ఈ ఫంక్షన్ కు చాల మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా ఫంక్షన్ కు రానివిధంగా ఇండస్ట్రీ ప్రముఖులు అంతా ఈ ఫంక్షన్ కు వస్తున్న పరిస్థితులలో చాల ముందుగానే ‘నిశ్శబ్దం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పరోక్షంగా జరిగిపోతోంది అనుకోవాలి..  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: