కొంత మంది హీరోలకి కొంత మంది హీరోయిన్లు అలా కొలిసొచ్చారంతే... ఒక్కోసారి ఎంత మంది హీరోయిన్లతో చేసిన రాని లక్ అంతా వాళ్ళతో నటించగానే ఒక్కసారిగా హిట్ కొట్టేస్తారు. వాళ్ళనే లక్కీ హీరోయిన్లు, లక్కీ హీరోలు అంటుంటారు. మరి అల్లుఅర్జున్కి టాప్ పెయిర్గా ఉన్న హీరోయిన్ బాగా కలిసొచ్చిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది పూజా హెగ్డే అనే చెప్పాలి. ఇప్పటివరకు అల్లుఅర్జున్ ఏ సినిమాలో కూడా ఆయన హీరోయిన్ని రిపీట్ చెయ్యలేదు. కేవలం పూజాని తప్పించి ఇంకెవరినీ కూడా రిపీట్ చెయ్యలేదు. అల్లుఅర్జున్ ఆ మధ్య కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. గమ్యం, పరుగు, వేదం, నాపేరుసూర్య నాఇల్లు ఇండియా ఇలాంటి సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి. దాంతో కొంత డీలా పడిపోయాడు అల్లుఅర్జున్ అప్పుడు పూజా హెగ్డేతో చేసిన డిజె (దువ్వాడ జగన్నాధం) చిత్రం మంచి హిట్ అయింది. దాంతో కాస్త కెరియర్ ఊపందుకుంది అనుకున్నాడు. కానీ అనుకోకుండా సడెన్గా రెండేళ్ళ గ్యాప్ వచ్చేసింది బన్నీకి.
ఆ తర్వాత రెండేళ్ళ గ్యాప్ అనంతరం గీతాఆర్ట్స్ బ్యానర్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇటీవలె విడుదలై బాక్సాఫీస్ బద్దలు కొట్టే కలెక్షన్లు సాధించింది `అలవైకుంఠపురంలో` చిత్రం. ఈ చిత్రం మంచి హిట్ కొట్టింది. ఇక ఈ చిత్రంలో అల్లుఅర్జున్కి పెయిర్గా పూజా హెగ్డే నటించింది. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. ఇక ప్రస్తుతం పూజా మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్ అని చెప్పాలి. ఏ సినిమాలో చూసినా పూజానే కనిపిస్తుంది. అందరూ అగ్రకథానాయకులతో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇటు తెలుగు అటు బాలీవుడ్ రెండు ఇండస్ట్రీలను ఏలుతుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ స్మగ్లింగ్ నేపధ్యంలో వచ్చే ఓ చిత్రంలో నటిస్తున్నారు. అందులో చాలా మాస్ లుక్లో కనిపించనున్నారని సమాచారం. అందులో ఆయన పాత్ర ఓ లారీ డ్రైవర్ అని చిత్ర యూనిట్ నుంచి సమాచారం. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీకి జోడిగా రష్మిక మండన్న నటిస్తోంది.