గంగోత్రి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన హీరో అల్లు అర్జున్.. ఈ సినిమా భారీ హిట్ అవ్వడంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు..ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలలో ప్రముఖంగా వినిపించే. పేరు అల్లు అర్జున్...దాదాపు రెండేళ్ల తర్వాత అల్లు అర్జున్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ఆయన పేరు మారు మోగిపోయింది.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురం లో సినిమాలో నటించి మంచి టాక్ ను అందుకున్నాయి..

 

 

 

ఇకపోతే సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు..ఎంతైనా టాప్ హీరో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న హీరో కావడంతో అల్లు అర్జున్ కోసం దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు.. అయితే అల వైకుంఠపురం హిట్ తో త్రివిక్రమ్ నాలుగో సినిమాను కూడా బన్నీతో చేయాలనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది.. ఆ సినిమా కూడా సేమ్ కథతో ఉందనుందని సామచారం...

 

 

 

మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ చిన్న మనస్పర్ధలు ఉన్నాయన్న వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి.. అది నిజమే అని ఇటీవల నిరూపించారు..అందుకే గతంలో ఓ దర్శకుడు రామ్ చరణ్ తో సినిమా చేయాలనుకుంటే అల్లు అరవింద్ అడ్డుకున్నారని వార్తలు వినపడుతున్నాయి.. అసలు ఎందుకు వీరిద్దరి మద్య గొడవలు వచ్చాయి అనే కారణాలు మాత్రం ఇప్పటివరకు ఎక్కడా తెలియడం లేదు అయితే సినిమాలా విషయంలో ఉండవచ్చు నని సినీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు..

 

 

 

మెగా ఫ్యామిలీతో సినిమా తీయాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడన్న విషయం ఈ మధ్య మరీ ఎక్కువగా వినపడిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు వారిద్దరి మద్య పొత్తు కుదరక పోవడంతో మళ్లీ అల వైకుంఠపురం లో సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట.. వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి..తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.. ప్రస్తుతం సుకుమార్ సినిమాలో నటిస్తున్నాడు... స్మగ్లర్ లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు.. అయితే ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళిన ఈ సినిమా రెండో పార్ట్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది .. ఈ ఏడాదిలోనే ఈసినిమా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది...ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: