‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ వెనువెంటనే సుజిత్ లాంటి ఏమాత్రం అనుభవంలేని దర్శకుడితో ‘సాహో’ ని చేసి ఘోర పరాభవాన్ని కొనితెచ్చుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడ ప్రభాస్ మార్గాన్ని అనుసరిస్తూ తప్పు చేస్తున్నాడు అంటూ చరణ్ అభిమానులు ఫీల్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.   


దీనికి కారణం ‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత చరణ్ ప్రదీప్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లుగా జోరుగా వార్తలు వస్తూ ఉండటం. వాస్తవానికి చరణ్ తన కెరియర్ లో ఇప్పటి వరకు కొత్త దర్శకులతో ఎప్పుడు పనిచేయలేదు. అంతగా అనుభవం లేని సంపత్ నందితో ‘రచ్చ’ మూవీని చేసినా అప్పటికే అతడు కొన్ని సినిమాలు చేసాడు. 


దీనికితోడు ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత చరణ్ ఇమేజ్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో చాల భారీగా పెరుగుతుందని అతడి అభిమానులు నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితులలో చరణ్ ను ఒక కొత్త దర్శకుడు హ్యాండిల్ చేయలేడు అన్నది అతడి అభిమానుల నమ్మకం. ఈ వార్తలు ఇలా ఉండగా రామ్ చరణ్ ఈ కొత్త దర్శకుడుని హోల్డ్ లో పెట్టి విక్రమ్ కుమార్ గౌతమ్ తిన్న నూరి లాంటి దర్శకులు చెప్పిన కథల పట్ల కూడ ఆసక్తి కనపరుస్తున్నట్లు టాక్. 


అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత తన పై మరింత అంచనాలు పెరిగి పోకుండా ఒక సింపుల్ లవ్ స్టోరీ చేయాలని చరణ్ భావిస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ విషయంలోనే రామ్ చరణ్ పొరపాట్లు చేస్తున్నాడు అంటూ అతడి అభిమానుల వాదన. ‘మగధీర’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ తరువాత వెరైటీ గా ఉంటుందని లవ్ స్టోరీగా తీసిన ‘ఆరెంజ్’ లో నటించి ఊహించని ఫ్లాప్ తెచ్చుకుని కోలుకోవడానికి చాల సమయం పట్టింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రమోగాలే చరణ్ చేయబోతున్నాడా అంటూ అతడి అభిమానులు పడుతున్న భయాలు చరణ్ దృష్టి వరకు రావడంతో చరణ్ తన తదుపరి సినిమా ఎంపిక విషయాలను కొద్ది కాలం వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: