గత ఏడాది టాలీవుడ్ లో విడదలైన అన్ని సినిమాల్లో కెల్లా ఎక్కువగా ప్రశంసలు పొందిన చిత్రం జెర్సీ. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో  గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించాడు.  సమ్మర్ లో వచ్చిన ఈసినిమా విమర్శకులను సైతం ఫిదా చేసి సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ కల్ట్ మూవీ  ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది.
 
ఒరిజినల్  వెర్షన్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను అక్కడ తెరకెక్కిస్తుండగా బడా నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు మరియు అమన్ గిల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ రీమేక్ లో షాహిద్ కపూర్  హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హర్యానా లో జరుగుతుంది.  ఈ చిత్రంలో షాహిద్ క్రికెటర్ గా కనిపించనున్నాడు అందుకోసం ఆయన క్రికెట్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు.  
 
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ  వ్యక్తిగత కోచ్.. దినేష్ లాడ్, షాహిద్ కు శిక్షణ ఇస్తున్నాడు. ఇదిలాఉంటే సినిమాలో షాహిద్ కోచ్ పాత్రలో తన తండ్రి పంకజ్  కపూర్ నటిస్తుండగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ ఏడాది ఆగస్టు 28న ఈ సినిమా ను విడుదలచేయనున్నారు. ఇక  గత ఏడాది షాహిద్ కపూర్ ,కబీర్ సింగ్ తో వచ్చి సెన్సేషన్ సృష్టించాడు. బ్లాక్ బాస్టర్ తెలుగు మూవీ అర్జున్ రెడ్డి  రీమేక్ గా తెరకెక్కిన  ఈ చిత్రం  250 కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. మరి ఇప్పుడు  ఈజెర్సీ రీమేక్ తో మరోసారి షాహిద్ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: