టాలీవుడ్ హీరోలు, అయినా డైరెక్టర్లు అయినా సరే ఎవరు ఎవరితో వర్క్ చేసినా కొంత మంది కొంత మందికే కనెక్ట్ అవుతారు. అలా మన టాలీవుడ్లో బన్నీ సుకుమార్కి షాడో అని అంటారు అందరూ. అది ఎందువల్లనంటే బన్నీ ఎన్నో చిత్రాల్లో నటించాడు. కానీ సుకుయార్ దర్శకత్వంలో నటించిన `ఆర్య` చిత్రం ఆయన కెరియర్లోనే పెద్ద హిట్ అయింది. అంతే కాక అత్యంత భారీ వసూళ్ళను రాబట్టిన చిత్రమది. అందుకే బన్నీ ఆర్య2లో కూడా నటించడం జరిగింది. ఆర్య లేకపోతే అల్లుఅర్జున్ కెరియర్లో ఆరేంజ్ హిట్ అనేది అప్పటి వరకు కూడా ఆయనకున్న మార్కెట్కి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. దానికి కారణం సుకుమార్. అసలు ఆ చిత్రాన్ని ముందు ప్రభాస్ చెయ్యాల్సింది. కానీ బన్నీ చేశారు. సుకుమార్ కథ రెఢీ చేసుకోగానే దిల్రాజుకి వెళ్లి కథ వినిపించారట.
అప్పుడు దిల్రాజు కథ బావుంది వెళ్ళి ప్రభాస్కి చెప్పండి ఆయన ఓకే చెపితే వెంటనే చేద్దామన్నారంట. ఎందుకంటే అప్పటికి ప్రభాస్ దిల్రాజుకి ఒకసినిమా చేయడానికి ఒప్పుకున్నారు. దాంతో ఆలస్యం చెయ్యకుండా సుకుమార్ ప్రభాస్ దగ్గరకి వెళ్ళి కథ చెప్పగా ప్రభాస్ ఈ కథ నాకంటే కూడా బన్నీకి బావుంటుంది. ఈ మధ్యనే `గంగోత్రి` చిత్రం తీశాడు కదా ఆ హీరోకి అయితే బాగా సూట్ అవుతుంది అని అన్నారట. అంతే వెంటనే గీతాఆర్ట్స్కి వెళ్ళి అరవింద్ కి కథ చెప్పడం జరిగింది. ఆయన వెంటనే కథ వినగానే ఓకే చెప్పారట దాంతో ఆయనకి కథ ఓకే అయింది. తర్వాత అల్లుఅర్జున్ కూడా ఒకే అనడంతో అలా ఆ సినిమాలో బన్నీ నటించారట. అందుకే ఆయన ఆర్యా2 కూడా చేశారు. అందులోనూ వీరిద్దరిదీ ఒకటే కమ్యూనిటీ కావడంతో ఇద్దరూ బాగా కనెక్ట్ అయ్యరని అందరూ అంటారు.
అంతేకాకుండా సుకుమార్ ఏదైనా సరే ఒక కథ అనుకున్న తర్వాత అల్లుఅర్జున్తో గంట డిస్కస్ చేస్తాడట. తనతో డిస్కస్ చెయ్యకుండా అసలు ముందుకెళ్ళడంట. వాళ్ళి ద్దరి మధ్య అంత అన్యోన్యత ఏర్పడింది. ఆర్య లేకపోతే ఇక అల్లుఅర్జున్ని జనాలు ఇంకో రకంగా చూసేవారు. అప్పటికి తనకున్న మార్కెట్ వాల్యూస్ వేరు ఆర్య హిట్ అయిన తర్వాత తన మార్కెట్ వేరుగా ఉంది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో గంధపుచక్కల స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో ఒకచిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సుక్కు బన్నీని డిఫరెంట్గా చూపించబోతున్నారు. కంప్లీట్ డీగ్లామర్ పాత్రలో చూపించబోతున్నట్లు సమాచారం. అయితే బన్నీకి జోడిగా రష్మికనటించనుందని సమాచారం.