వరస పరాజయాల తరువాత గత ఏడాది సమ్మర్ లో చిత్ర లహరి తో డీసెంట్ హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చిన సుప్రీం హీరో ధరమ్ తేజ్ అదే ఏడాది చివర్లో  ప్రతి రోజు పండుగే తోవచ్చి కెరీర్ లో మొదటి బ్లాక్ బాస్టర్  విజయాన్ని అందుకున్నాడు. మారుతి డైరెక్షన్ లో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం 32కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక  ఈ రెండు సినిమాలు ఇచ్చిన జోష్ తో సాయి ధరమ్ వరసగా సినిమాలకు ఓకే చెప్తున్నాడు.
 
అందులో భాగంగా ప్రస్తుతం సాయి, నూతన దర్శకుడు సుబ్బు డైరెక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా లో నటిస్తున్నాడు. గత కోన్ని నెలలు నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాబా నటేష్ కథానాయికగా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. సీనియర్ ప్రొడ్యూసర్  బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదలకానుంది.
 
ఇదిలావుంటే  తాజాగా  సాయి ధరమ్ మరో సినిమా కు గ్రీన్ సిగ్నల్  ఇచ్చాడు. వెన్నెల, ప్రస్థానం ఫేమ్  దేవాకట్టా తో తన 14వ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ రోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యాడు. సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఏప్రిల్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుండగా నివేత పేతురాజ్ కథానాయికగా నటించనుంది. మణిశర్మ సంగీతం అందించనున్నాడు. భగవాన్, పుల్ల రావు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ఈఏడాది చివర్లో విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: