ఇటీవల సూపర్‌ హిట్ అయిన అల వైకుంఠపురములో సినిమాలో అంతే స్థాయిలో సూపర్‌ హిట్ అయిన పాట బుట్ట బొమ్మ. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ పాటకు టిక్‌ టాక్‌లు చేయటంతో ఈ పాటు ఓ రేంజ్‌ లో ట్రెండ్ అయ్యింది. ఇప్పటికే చాలా ప్లాట్‌ ఫామ్స్‌ లో ఈ పాట టాప్‌ లిస్ట్‌లో కొనసాగుతోంది. ఈ పాట ఇంత ఘన విజయం సాదించటంలో సంగీత దర్శకుడు తమన్ తో పాటు గాయకుడు అర్మాన్‌ మాలిక్‌ టాలెంట్‌ కూడా ఎంతో ఉంది. తన వాయిస్‌ తో బుట్ట బొమ్మ పాటకు మరింత లైఫ్‌ తీసుకువచ్చాడు అర్మాన్‌.

 

తాజాగా ఈ గాయకుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అర్మాన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ లోని అన్ని పాత పోస్ట్‌ లు సడన్‌గా డిలీట్‌ అయ్యాయి. అంతేకాదు చివరగా (i Can't take it any more) నేను ఇంక ఇది బరించలేను అంటూ బ్లాక్‌ స్క్రీన్‌ మీద టెక్ట్స్‌ తో ఓ పోస్ట్ చేశాడు. ప్రోఫైల్‌ ఫిక్చర్‌ ను కూడా తీసేసి బ్లాక్ ఇమేజ్‌ పెట్టాడు అర్మాన్‌. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

 

అర్మాన్ ఇలా ఎందుకు చేశాడన్న చర్చ జరుగుతోంది. ఎవరైన సోషల్ మీడియాలో అర్మాన్‌ వేదిస్తున్నారా..? లేక మరేదైనా విషయంలో అర్మాన్‌ ఇలా స్పందించాడా.? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అర్మాన్ ఇన్‌స్టా అకౌంట్‌ హ్యాక్ అయి ఉంటుందని భావిస్తున్నారు. అయితే అసలు ఏం జరిగిందన్న విషయం తెలియాలంటే మాత్రం అర్మాన్ అఫీషియల్‌గా ప్రకటించే వరకు వెయిట్ చేయిల్సిందే.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by armaan malik 🧿 (@armaanmalik) on

మరింత సమాచారం తెలుసుకోండి: