తెలుగు ఇండస్ట్రీలో ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా.. ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా అంటూ వర్షంలో తడుస్తూ కుర్రాళ్ల మతులు పొగొట్టిన బ్యూటీ త్రిష ‘వర్షం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.  ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించగా గోపిచంద్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే.  ఈ చిత్రం తర్వాత తెలుగు లో వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంది కోలీవుడ్ బ్యూటీ.  తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పటికీ 18 ఏళ్లు గడిచినా ఇప్పటికీ గ్లామర్ పాత్రల్లో నటిస్తుంది.  త్రిష రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొంది.  

 

కెరీర్ బిగినింగ్ లో  అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది.  ఆ తర్వాత మోడల్ గా ప్రస్థానం మొదలు పెట్టి ఇండస్ట్రీలో కాలు మోపింది.  గత కొంత కాలంగా తెలుగు లో ఈ బ్యూటీకి పెద్దగా ఛాన్సులు రావడం లేదు.  తమిళ్ లో ఎక్కువ ఛాన్స్ లు దక్కించుకుంటుది.  ఆ మద్య వరుసగా హర్రర్ నేపథ్యంలో నటిస్తూ వస్తుంది.   96 చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది.

 

ఈ అమ్మడు నటించిన  పరమపదం విళైయాట్టు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఇటీవల విడుదల సిద్దమైంది.. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడతూ.. తాను పెళ్లి చేసుకుంటాను.. కానీ ఎప్పుడు అన్న విషయం ఇప్పుడు చెప్పలేను. అయితే పెద్దలు కుదర్చిన పెళ్లి చేసుకోనని.. తనకు నచ్చినవాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పింది.  తాను హీరోనే కావాలని రూల్ లేదు.. మంచి మనసు ఉండి.. తనను బాగా చూసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: