అల వైకుంఠ పురములో చిత్రం భారీ హిట్ అందించింది అల్లు అర్జున్ కి. త్రివిక్రం దర్శకత్వంతో వచ్చిన ఆ సినిమా తారా స్థాయికి చేరింది. సంక్రాంతికి బన్నీ ఈ సినిమాతో ఫ్యాన్స్కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే త్రివిక్రం దర్శకత్వం అద్భుతం అని తెలిసిందే. ఆయన దర్శకత్వంలో ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. మంచి కాన్సెప్ట్ తో చక్కటి కధతో ఈ దర్శకుడు చిత్రాలని అందిస్తాడు.

 

 

ఇప్పటి వరకు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్నీ వేటికి అవే బాగున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ డైరక్టర్ తీసినవి 11 కాగా వాటిలో 6 సినిమాలు మెగా ఫ్యామిలీ హీరోలే నటించడం ఆశ్చర్యం. అయితే త్రివిక్రం కోసం మెగా ఫ్యామిలీ హీరోలు ఎదురు చూడడంలో తప్పు ఏమీ లేదు.

 

 

 

అటు మెగాస్టార్ నుండి పవన్ కళ్యాణ్, రాం చరణ్, వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్ ఇలా యువ తారల సైతం త్రివిక్రం సినిమాకి సై అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తో త్రివిక్రం సినిమాలు తీసాడు. జల్సా, అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది. అయితే అజ్ఞాతవాసి ఒక్కటే హిట్ కొట్టలేదు. మిగిలిన రెండు మంచి స్థానం చేరుకున్నాయి. అలానే బన్నీతో త్రివిక్రం జులాయి, S/o. సత్యమూర్తి అల వైకుంఠ పురములో సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ మూడు మంచి స్థానం దక్కించుకున్నాయి.

 

 

 

ఆయనతో నేనంటే నేను అన్నట్లు మెగా కుటుంబం క్యూ కట్టి ఉంది. చిరంజీవి త్రివిక్రంతో సినిమా చెయ్యనున్నాడని తెలిసిన సంగతే. అయితే త్రివిక్రం కోసం మెగా ఫ్యామిలీ హీరోలు ఎదురు చూడడంలో తప్పు ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ నాల్గవ సినిమాకి సై అంటున్నాడట. రాం చరణ్ త్రివిక్రంతో సినిమాకి రెడి అవుతాడేమో! అలానే వరుణ్, సాయి ధర్మ తేజ్ కూడ ఒక్కటైనా చెయ్యాలని ఎదురు చూస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: