తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయన వారసులుగా ఎంతో మంది హీరోలు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయన సోదరి తనయుడు సాయిధరమ్ తేజ్ ‘రేయ్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.  అయితే ఆ చిత్రం కన్నా ముందు పిల్లా నువ్వు లేని జీవితం రిలీజ్ అయ్యింది.  గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఇలాగే జరిగింది.. ఆయన నటించిన మొదటి చిత్రం పునాధిరాళ్లు.. కానీ దానికన్నా ముందు ప్రాణం ఖరీదు రిలీజ్ అయ్యింది.  అప్పట్లో సాయిధరమ్ తేజ్ మామ పోలికలు బాగా ఉన్నాయి.. అదే అదృష్టం కలిసి వస్తుందని అన్నారు.  అయితే పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు.

 

తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన ఆరు చిత్రాలు వరుస ఫ్లాపులు అయ్యాయి.  గత ఏడాది చిత్రలహరి, ప్రతిరోజు పండుగే చిత్రాలతో మంచి విజయం అందుకున్నాడు.  అప్పట్లో కథలు ఎంచుకునే విషయంలో సాయిధరమ్ తేజ్ తొందరపడటం వల్లే వరుస డిజాస్టర్స్ అయ్యాయని.. తన మేనమామ చిరంజీవి సలహా సూచన మేరకు చిత్రలహరి, ప్రతిరోజు పండగ విషయంలో జాగ్రత్తలు తీసుకొని విజయం సాధించారని అంటారు. తాజాగా సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది.   హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది.

 

ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్‌ కొట్టారు. ఈ సందర్భంగా సాయితేజ్‌ ట్వీట్ చేశాడు. ‘ఈ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఏ పదాలూ సరిపోవట్లేవు. థ్యాంక్యూ సో మచ్‌ పవన్ కల్యాణ్‌ మామా..' అని పేర్కొన్నారు.  సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ఈ చిత్రానికి దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్నారు.   పవన్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్‌ కొట్టడంతో చిత్ర యూనిట్ తెగ సంతోషంలో మునిగిపోయారు. ఈ చిత్రంలో సాయితేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది.   జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: