కొడుకు కెరీర్ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు విక్రమ్. తన సినిమాలను పక్కనపెట్టి మరీ కొడుకు సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. అయితే వారసుడి కోసం ఇంత కష్టపడినా విక్రమ్ కు మనశ్శాంతి లేకుండా పోతోంది. కోలీవుడ్ లో జరుగుతోన్న ఓ ప్రచారంతో విక్రమ్ చాలా బాధపడుతున్నాడు. తన కొడుకుపై మీకు ఎందుకు అంత పగ అని వాపోతున్నాడు. 

 

ధృవ్ ఫారెన్ లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తున్నపుడే వర్మ ఆఫర్ వచ్చింది. అర్జున్ రెడ్డి రీమేక్ గా మొదలైన ఈ సినిమా వర్మగా ఆగిపోయి ఆదిత్య వర్మగా రిలీజ్ అయింది. అయితే సినిమా షూటింగ్ కష్టాలు దాటుకొని బాక్సాఫీస్ బరిలో దిగినా అంచనాలు అందుకోలేకపోయింది. ఒరిజినల్ అర్జున్ రెడ్డి, హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో పోల్చి ఆదిత్య వర్మ కి నెగిటివ్ మార్కులు వేశారు క్రిటిక్స్. 

 

ఆదిత్య వర్మ సినిమా పోయిన బాధలో ఉన్న తండ్రీకొడుకులను ఇప్పుడో వార్త మరింత బాధపెడుతోంది. ధృవ్ సినిమాలు మానేసి వ్యాపారాల్లోకి వెళ్తున్నాడని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. దీంతో మొదటి సినిమాతోనే కొడుకుని ఇంటికి పంపేసే ప్రయత్నాలు చేస్తున్నారని.. విక్రమ్ చాలా బాధపడుతున్నాడట. ఈ ప్రచారంతో ధృవ్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాడని చెబుతున్నారు. 

 

ఆదిత్య వర్మ తర్వాత మధ్య వదిలేసిన ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ని కంటిన్యూ చేయాలనుకున్నాడు ధృవ్. అయితే మొదటి సినిమానే బోల్డన్ని పాఠాలు నేర్పడంతో ఇంక ఆ క్లాస్ రూమ్ లెసెన్స్ ని వదిలేశాడు. పరియేరుమ్ పెరుమాల్ తో కోలీవుడ్ లో సంచలనం సృష్టించిన మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటించబోతున్నాడట ధృవ్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని విక్రమ్ సన్నిహితులు చెబుతున్నారు. మరి ధృవ్ గురించి కోలీవుడ్ లో ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతోంది.. ఎవరు చేస్తున్నారు.. అనేదే బిగ్ క్వశ్చన్ గా మారుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: