మలయాళ బిగ్‌ బాస్ సీజన్ 2 షోలో దారునమైన ఘటన చోటుచేసుకుంది. తోటి కంటెస్టెంట్‌ అయిన రేష్మ కళ్లలో కంటెస్టెంట్ రంజిత్ కుమార్ పచ్చి కారం ముద్ద పెట్టి మరో వివాదానికి తెరలేపారు. 9వ వారం ఎపిసోడ్ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో  ఎన్నో వివాదాలు చోటుచేసుకొన్నాయి. పలు రకాల టాస్క్ లతో వివాదంగా సాగుతుంది. తాజాగా 66 వ ఎపిసోడ్ లో స్కూల్ స్టూడెంట్స్, టీచర్స్ అనే కాన్సెప్ట్ ను టాస్క్ గా ఇచ్చారు. దాంతో బిగ్‌ బాస్ షోలో అత్యుత్సహం కనపర్చిన రంజిత్ కుమార్ రేష్మ కళ్ళలో పచ్చికారం పెట్టారు. కాగా., ఆయనపై పలు సెక్షన్స్ కింద కేసును కూడా నమోదు చేశారు. ఇంకా బిగ్ బాస్ హౌస్ నుంచి గెంటేశారు. 


కాగా., ఇలా ఈ వివాదం కొనసాగుతుండగానే ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుంచి జజ్లా మదస్సెరీ ఎలిమినేట్ అయ్యారు. ఉన్నత విద్యావేత్త, విద్యారంగ నిపుణుడు అయిన రంజిత్ కుమార్‌ పై తీవ్ర ఆరోపణలు చేసింది జజ్లా. ఇప్పుడు ఈ ఆరోపణలు వైరల్ గా మారాయి. ఇంతకీ ఏమని ఆరోపించిందంటే.. 

 

ఉన్నత విద్యావేత్త, విద్యారంగ నిపుణుడు, సామాజిక కార్యకర్త, బిగ్‌ బాస్ సెలబ్రిటీ అయిన రంజిత్ కుమార్ తీరుపై తన ఫేస్‌ బుక్ అకౌంట్‌ లో బహిరంగ లేఖ రాశారు జజ్లా మదస్సెరీ. ఇలా ఫేస్ బుక్ లో లేఖ రాయటం సంచలనం రేపుతోంది. 
బిగ్ బాస్ లో కంటెస్టెంట్లు అయిన మంజు పథ్రోసే, ఫక్రూ మధ్య సన్నిహిత సంబంధాలను సోషల్ మీడియా యూజర్లు కామెంట్స్ చేయడం పై జజ్లా మదస్సెరీ భగ్గుమన్నది. ఇప్పుడు ఈ వ్యవహారాలు వైరల్ అయ్యాయి.


కేరళ మోరల్ పోలీసింగ్ వల్ల రంజిత్ కు పాపులారిటీ వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన అన్ని విషయాల్లో కలుషితమైన వ్యక్తి అంటూ.. ఆయనకు సెక్స్ కోరికలు చాలా ఎక్కువని జజ్లా తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనతో రంజిత్ కుమార్ చాలా నిచ్యంగా ప్రవర్తించే వాడని చెప్పుకొచ్చింది. తనతో ఏ విధంగా చెడుగా, దారుణంగా, మొరటుగా ప్రవర్తించారనే ఫోటోను జజ్లా మదస్సెరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉద్దేశపూర్వకంగా నా శరీరాన్ని తాకేవారని ఆమె పేర్కొన్నారు. సమాజంలో వెనుకబాటు తనాన్ని నేను ఉద్ధరిస్తున్నానంటూ.. చెప్పుకొనే వ్యక్తి రంజిత్ కుమార్‌. మదస్సెరీ తనతో పలు మార్లు మాట్లాడిందని బిగ్‌ బాస్‌ లో టాస్కులు నిర్వహించినప్పుడు కావాలని తన శరీరాన్ని, ప్రైవేట్ పార్ట్స్ తాకేవారని అన్నారు.  అసలు ఆయన తీరు చాలా భయంకరంగా ఉండేదని ఆమె తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: