టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నుంచి హీరోయిన్లు గా వెండి తెరకు పరిచయం అవుతున్నారు. ఈ మద్య కన్నడ నుంచి వస్తున్న వారు కూడా మంచి విజయాలు అందుకుంటున్నారు. తాజాగా కోలీవుడ్ నుంచి రెజీనా కాసాండ్రా 'శివ మనసులో శృతి' సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయిన..ఆ తర్వాత వచ్చిన 'రోటీన్ లవ్ స్టోరీ' సినిమాతో మంచి హిట్ కొట్టి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలతో వరుస విజయాలు అందుకుంది.
ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. అటూ తమిళ, కన్నడ సినిమాల్లో కూడా ప్రవేశించింది. ఆ మద్య అడవి శేషు హీరోగా ‘ఎవరు ’ మూవీలో నెగిటీవ్ పాత్రలో కనిపించింది. తెలుగులో స్టార్ హీరోయిన్స్ గా వెలుగొందుతున్నవారు, అవసరమైతే ఐటెమ్ సాంగ్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ మూవీలో రెజీనా ఓ ఐటమ్ సాంగ్ లో నటిస్తుందని వార్తలు వచ్చాయి. అంతే కాదు ఇటీవలే ఈ గీతాన్ని చిత్రీకరించారు. తాజాగా ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ లో నటిస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ విషయం పై స్పందించిన చిరంజీవిగారి సరసన ఒకపాటలో సందడి చేసే ఛాన్స్ అనేసరికి రెండో ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నాను. ఆయన సరసన డాన్స్ చేయాలనే నా ముచ్చటను తీర్చుకున్నాను. ఈ సాంగును ఐటెమ్ అనొద్దు .. స్పెషల్ సాంగ్ అంటేనే నాకు బాగుంటుంది. ఈ పాటను రాత్రి వేళల్లో ఆరు రోజుల పాటు చిత్రీకరించారు. చిరంజీవి పక్కన ఎవరైనా నటించాలని చూస్తుంటారు. అంతే కానీ నేను ఐటమ్ బాంబ్ ని మాత్రం కాదు అంటే మాత్రం ఒప్పుకోను అన్నారు. ఈ సాంగును ఐటెమ్ అనొద్దు .. స్పెషల్ సాంగ్ అంటేనే నాకు బాగుంటుంది.