మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అనే చెప్పాలి. శ్రీ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో ఒక్కసారిగా మంచి పేరు దక్కించుకుంది. ఇక అక్కడి నుండి మెల్లగా అవకాశాలతో ముందుకు సాగిన తమన్నా, ఆ తరువాత నుండి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించింది. ఇక ఆపై టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లో కూడా పలువురు అగ్ర నటుల సరసన హీరోయిన్ గా ఛాన్స్ లు పట్టేసిన తమన్నా, అనతికాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగారు. 

 

ఇక ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ సరసన సీటిమార్ సినిమాతో పాటు దట్ ఈజ్ మహాలక్ష్మి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న తమన్నా, ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ ఉంటారు. ఇకపోతే నేడు ఆమె పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం ఒకింత సంచలనంగా మారింది. వాస్తవానికి తెలుగులో శ్రీ కంటే ముందే హిందీలో సమీర్ అఫ్తాబ్ శాసన చాంద్ సే రోషన్ చెహరా సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా, ఇటీవల సక్సెస్ఫుల్ గా సినిమాల్లోకి రంగప్రవేశం చేసి ఆమె 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 

 

ఆ సందర్భంగా నేడు ప్రముఖ జాతీయ పత్రిక వెడ్డింగ్ కి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ తో పాటు ఫోటో షూట్ ని నిర్వహించిన తమన్నా దానిని తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. నేను సినిమాల్లోకి ప్రవేశించి 15 ఏళ్ళు పూర్తి అవడంతో పాటు వెడ్డింగ్ పత్రిక 9 వ యానివర్సరీ సందర్భంగా కూడా ఇవేనా శుభాకాంక్షలు. నిజానికి ఈ 15 ఏళ్ళ సంబరాన్ని ఈ వెడ్డింగ్ పత్రికతో కలిసి ఆనందంగా, ప్రేమతో, ఆహ్లాదంగా, చక్కగా భోజనం చేసి ఒక పెళ్లి వేడుకలా జరుపుకున్నాను అంటూ ఆమె పోస్ట్ చేసింది. అయితే ముందుగా తమన్నా పెట్టిన ఈ పోస్ట్ పై ఆమె అభిమానులు కొంత షాక్ కు గురైనప్పటికీ, ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని ఆమెకు 15 ఏళ్ళ సినిమా కెరీర్ పూర్తి అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: