ముందుగా బుల్లితెరకు తన ఆకట్టుకునే యాక్టింగ్ టాలెంట్ తో యాంకర్ గా పరిచయం అయిన అనసూయ, అదేసమయంలో అక్కడక్కడా కొన్ని న్యూస్ ఛానల్స్ లో పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇక ఆ తరువాత నుండి బుల్లితెరపై తన యాక్టింగ్ టాలెంట్ తో మెల్లగా అవకాశాలు అందుకుని దూసుకుపోయిన అనసూయ, పెళ్లి అయి ఇద్దరు బిడ్డలకు తెల్ల అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎంతో అందంగా తన ఫిజిక్ ని మెయింటెయిన్ చేస్తూ ఉంటారు. 

 

ఇక ఆ తరువాత ఆమెకు మరింతగా గుర్తింపు రావడంతో ఆమె పలు సినిమా ఫంక్షన్స్ కు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించడం జరిగింది. ఆపై సినిమాల్లోకి కూడా రంగప్రవేశం చేసిన అనసూయ అక్కడక్కడా కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు గడించారు. ఆమె నటించిన పాత్రల్లో రంగస్థలంలోని రంగమ్మత్త, క్షణం సినిమాలోని నెగటివ్ రోల్, అలానే ఇటీవల కథనం సినిమాలోని పాత్రలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. 

 

అయితే ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన అభిమానులకు ఎంతో చేరువగా ఉంటూ, తన కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాలు వారితో షేర్ చేసుకునే అలవాటున్న అనసూయ, నేడు పోస్ట్ చేసిన ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాలలో ఎంతో వైరల్ అవుతున్నాయి. బ్రౌన్ కలర్ అచ్చ తెలుగు లంగావోణి ధరించి, డాన్స్ అనేది నా మనసు యొక్క భాష అంటూ ఆమె పోస్ట్ చేసిన ఫోటోలపై పలువురు నెటిజన్లు ఎంతో ఆసక్తిగా కామెంట్స్ చేస్తన్నారు. ఎక్కువగా లేటెస్ట్ స్టయిల్ ట్రెండీ డ్రెస్సుల్లో దర్శనం ఇచ్చే మీరు, నేడు ఈ విధంగా చక్కగా తెలుగింటి అమ్మాయిలా లంగావోణీ ధరించి చూడడానికి ఎంతో చక్కగా ఉన్నారని పలువురు ఆమె అందంపై పొగడ్తలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే మీ అందరం ముందు హీరోయిన్స్ కూడా దిగదుడుపే అంటూ పొగుడుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: