ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న భయంకరమైన కరోనా వైరస్ దెబ్బకు ప్రజలతో పాటు ఒక్కో రంగం కూడా ఎంతో భయబ్రాంతులకు గురవుతుంది. ఇప్పటికే కొన్ని ఐటి రంగాల వారు ఈ మహమ్మారి దెబ్బకు భయపడి తమ కంపెనీ ఎంప్లాయ్స్ ను ఇంటికి పంపి, కంపెనీలకు తాళం వేస్తుండగా, మరోవైపు కొందరు ప్రజలు అయితే బయటకు వస్తే ఎక్కడ ఈ మహమ్మారి బారిన పెడతామో అని భయంతో, ఏదైనా ముఖ్యమైన పని ఉంటె తప్ప ప్రయాణాలు వంటి వాటిని పూర్తిగా వాయిదా వేసుకుంటున్నారు. 

 

ఇక నేడు ఈ కరోనా వైరస్, ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్ తో పాటు ఆయన భార్యకు కూడా సోకడం ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంచలనం రేపింది. అయితే ప్రముఖ స్పెషలిస్ట్ వైద్యులు కొందరు వారిద్దరికీ ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే కొన్ని ఏరియాల్లో సినిమా థియేటర్స్ కు ప్రజలు వెళ్లాలంటేనే భయపడుతుండగా, నిన్న కేరళ ప్రభుత్వం ఏకంగా ఈనెల 31వరకు తమ రాష్ట్రంలో సినిమా థియేటర్స్ ని బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. 

 

అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో సినిమా థియేటర్స్ కరోనా ఎఫెక్ట్ తో బంద్ కానున్నట్లు సమాచారం. అక్కడి అధికారులకు నేడు ఈ విషయమై ప్రభుత్వం నుండి ప్రతిపాదన అందిందని, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా థియేటర్స్ బంద్ చేయడం తప్పదని తెలుస్తోంది. కాగా కేవలం నెల్లూరు లోనే థియేటర్స్ బంద్ అవుతాయా లేక ఆంధ్రప్రదేశ్ లోని మిగతా జిల్లాల థియేటర్స్ పై కూడా ఈ కరోనా ప్రభావం పడుతుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈ వార్త పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: