కీర్తి సురేష్ .. తెలుగులో సావిత్రి లా బాగా ఫేమస్ అయింది. తమిళంలో సూపర్ హిట్ సినిమాలలో నటించిన కీర్తి సురేష్ తెలుగులో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. రాం పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అంతేకాదు చాలా సినిమాల తర్వాత రాం కి మంచి హిట్ పడింది. ఇక ఫస్ట్ సినిమాతోనే కీర్తికి మంచి హిట్ దక్కింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన నేను లోకల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా కూడా కీర్తికి హిట్ ని అందించింది. ఈ రెండు సినిమాలు మంచి కమర్షియల్ సక్సస్ లను ఇవ్వగా ఇక మూడో సినిమా టాలీవుడ్ లో ఒక రేంజ్ ఇమేజ్ ని ఇచ్చింది.

 

అదే మహానటి. మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కించిన ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ కి ఎంత గొప్ప పేరు తెచ్చిపెట్టిందో కీర్తి సురేష్ కి అంతకు మించి గొప్ప పరుని తీసుకు వచ్చింది. దాదాపుగా సావిత్రిని కళ్ళ ముందు చూసినట్టుగా నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత కీర్తి సురేష్ తెలుగులో మళ్ళీ నటించలేదు. కాని నాగార్జున నటించిన మన్మధుడు 2 లో మాత్రం అలా తళుక్కున మెరిసింది. 

 

ఇక తమిళంలో మాత్రం అందరి తోటి కమర్షియల్ సినిమాలలో నటిస్తుంది. విక్రం తో చేసిన సినిమాలో కాస్త గ్లామర్ డోస్ ని పెంచింది. అయితే తెలుగులో మాత్రం అలాంటి గ్లామర్ పాత్రలు పోషించడానికి ఒప్పుకోలేదు. కానీ ప్రేక్షకులకి కీర్తిని గ్లామర్ గా చూడాలని ఆశపడుతున్నారు. అంతేకాదు దర్శక, నిర్మాతలు కీర్తి ని మంచి గ్లామర్ పాత్రల్లో హాట్ గా చూపించాలని తాపత్రయ పడుతున్నారు. కాని ఇంతకాలం అలాంటి పాత్రలకి కీర్తి ఒప్పుకోలేదు.

 

దాంతో అలాంటి రోల్స్ చేస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆలోచించుకునే లోపే దర్శకుడు, నిర్మాత పరవాలేదు అంటూ వెంట పడుతున్నారట. అయితే తాజాగా తను కూడా గ్లామర్ రోల్స్ లో నటించాలనుకుంటుందట కానీ మితిమీరిన గ్లామర్ పాత్రలు మాత్రం ఒప్పుకోనని నిర్మొహమాటంగా చెబుతుందట. కానీ దర్శక, నిర్మాతలు మాత్రం కీర్తి కి ఎక్స్‌ఫోజింగ్, రొమాంటిక్ క్యారెక్టర్స్ ఆఫర్ చేస్తున్నారట. నేను చేయను అన్నా వినకుండా ఇబ్బంది పెడుతున్నారట.  ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: