ఒక హీరోకి డబల్ హ్యాట్రిక్ ఫ్లాప్ లు వచ్చిన తరువాత నిలదొక్కుకోవడం అంత సులువైన పనికాదు. అయితే సాయి ధరమ్ తేజ్ విషయంలో అలా జరిగింది. ‘చిత్రలహరి’ తో కోలుకున్న ఈమెగా మేనల్లుడు గత డిసెంబర్ లో విడుదలైన ‘ప్రతిరోజు పండగే’ మూవీ సూపర్ సక్సస్ తో తిరిగి పూర్తిగా ట్రాక్ లోకి వచ్చాడు. 
 
 
ఈసంవత్సరం అదే హిట్ ట్రాక్ ను కొనసాగించాలని తన లేటెస్ట్ మూవీ మే 1న విడుదల కాబోయే ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా పై కూడ చాల అంచనాలు పెట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితులలో సాయి తేజ్ తీసుకున్న ఒక షాకింగ్ నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఫ్లాప్ డైరెక్టర్ గా ముద్ర వేయించుకుని సినిమాల అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న క్రియేటివ్ డైరెక్టర్ దేవా కట్టా దర్శకత్వంలో ఒక మూవీని ఓకె చేయడమే కాకుండా ఆమూవీ నిన్న పవన్ చేతుల మీదగా ఫిలింనగర్ దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని ప్రారంభం కావడం వెనుక పవన్ హస్తం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. 
 
 
పవన్ ఫిలిం రీ ఎంట్రి గురించి ఆలోచిస్తున్న పరిస్థుతులలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు గాంచిన దేవకట్ట పవన్ ను కలిసి ఒక పవర్ ఫుల్ పొలిటికల్ మూవీ సబ్జెక్ట్ ను చెప్పాడు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే పవన్ ఈకథ గురించి ఆలోచించే లోపే దిల్ రాజ్ ఒత్తిడితో ‘వకీల్ సాబ్’ లో అదేవిధంగా క్రిష్ ఎ ఎమ్ రత్నం ల మూవీలో ఇరుక్కుపోయాడు. అమెరికాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి సినిమాల పై మోజుతో ఇండస్ట్రీకి వచ్చి ‘ప్రస్థానం’ లాంటి గొప్ప సినిమాను తీసిన దేవకట్ట అంటే పవన్ కు ప్రత్యేక అభిమానం. 
 
 
ఇలాంటి పరిస్థితులలో ఫెయిల్యూర్స్ లో ఉన్నా లెక్కచేయకుండా దేవకట్టా కు  పవన్ సినిమా చేస్తాను అని ఇచ్చిన మాటను తన మేనల్లుడు సాయి తేజ్ ఈమూవీలో నటించడం ద్వారా పవన్ తన మాటను నిలబెట్టుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు రాజకీయ నేపథ్యంలో సాగే సీరియస్ సినిమా ఇది అని అంటున్నారు. సాయి ధరమ్ తేజ్ కేరీర్ నిలదొక్కుకుంటోంది అని అందరు భావిస్తున్న పరిస్థితులలో సాయి తేజ్ ఇలాంటి రిస్క్ ఎందుకు చేస్తున్నాడు అని ప్రశ్నించే వారికి తన మేనమామ పవన్ ఇచ్చిన మాట కోసం ఇలా సాయి తేజ్ రిస్క్ చేస్తున్నాడా అని అనిపించడం సహజం.. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: