సౌత్ స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క ఇండస్ట్రీకి పరిచయమై 15 ఏళ్ళు అవుతుంది.. అందుకే ఆమె చేసిన దర్శకులందరికి కృతజ్ఞతలు తెలిపేందుకు గురువారం ఒక ఈవెంట్ జరిగింది. అనుష్కని పరిచయం చేసిన సూపర్ నుండి రేపు రాబోతున్న నిశ్శబ్దం సినిమాను డైరెక్ట్ చేసిన హేమంత్ మధుకర్ వరకు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. అనుష్క 15 ఏళ్ల సినీ కెరియర్ తో పాటుగా ఆమె చేసిన నిశ్శబ్దం ప్రమోషనల్ ఈవెంట్ గా ఈ కార్యక్రమం నడిచింది.

 

తాను ఈ పొజిషన్ లో ఉండటానికి సహకరించిన అందరికి థ్యాంక్స్ చెప్పింది అనుష్క. ఇన్నేళ్ల కెరియర్ లో ఎన్నో మంచి చెడులు.. వాటిలో తోడున్న అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పింది అనుష్క. తనతో సినిమా చేసిన ప్రతి దర్శకుడిని ప్రస్తావించి వారి వల్లే తను ఇప్పుడు ఇక్కడ ఉన్నానని అన్నారు. ఇక నిశ్శబ్దం సినిమాలో పనిచేసిన టీమ్ అందరికి నిర్మాత కోనా వెంకట్, దర్శకుడు హేమంత్ మధుకర్ అందరి గురించి మాట్లాడారు అనుష్క.

 

అయితే ఈ ఈవెంట్ లో పాల్గొన్న ఛార్మి అనుష్క పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అన్ని మాట్లాడావ్ ఇంతకీ పెళ్ళెప్పుడు అని అనుష్కని అడిగింది ఛార్మి కౌర్. అదే నాకు తెలియట్లేదని.. తను పెళ్ళిచేసుకుంటే మీ అందరికి తెలుస్తుందని అన్నది అనుష్క. ఇక ఇంతలో మైక్ అందుకున్న పూరి జగన్నాథ్ హీరోయిన్స్ కు పెళ్లవడం తనకు నచ్చదని అన్నాడు. మరి పూరి ఏ ఉద్దేశ్యంతో ఆ మాట అన్నాడో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పూరి చేసిన ఆ కామెంట్స్ గురించి ట్రోల్స్ చేస్తున్నారు.

 

15 ఏళ్ల కెరియర్ లో అనుష్క ఎన్నో ప్రయోగాలు చేసింది. ముఖ్యానంగా టాలీవుడ్ లో ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కు చాలా గ్యాప్ తర్వాత ఊపందుకునేలా చేసింది అనుష్క మాత్రమే. ఆమె చేసిన అరుంధతి, రుద్రమదేవి సినిమాలు ఎప్పటికి ప్రత్యేకమైన స్థానం లో ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: