టాలీవుడ్ లో నాగార్జున నటించిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అనుష్క.  సెకండ్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన అనుష్క తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.  తెలుగు, తమిళ భాషల్లో నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది.  అనుష్క ఒక యోగా టీచర్.. అప్పట్లో ఆమె ఫిట్ నెస్ కి హీరోలు ఫిదా అయ్యేవారు.  అందుకే అనుష్కకు తెలుగు, తమిళంలో వరుసగా ఛాన్సులు వచ్చాయి.  అరుంధతి సినిమా తర్వాత అనుష్క లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించడం మొదలు పెట్టింది.  అప్పటి నుంచి రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి లాంటి ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించింది.  తాజాగా అనుష్క నిశ్శబ్దం మూవీలో నటిస్తుంది.

 

ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  అందరై డైరెక్టర్ అనుష్కను పొగడ్తలతో ముంచెత్తారు.. నిజమే అనుష్క చాలా మంచిది’ అని అందరూ చెప్పే మాట నిజమేనని అన్నారు. ఆమె నిజంగా మంచిదేనని, ఆమె దగ్గర చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని అన్నారు. అనుష్క కు ఎంత సెలబ్రెటీ హోదా ఉన్నా ఆమె ఎవరితో అయినా చాలా కలుపుగోలు తనంతో ఉంటారని.. ఏమాత్రం గర్వం ప్రదర్శించదని అన్నారు. 

 

తన అందమైన నవ్వుతో ఎలాంటి వారితో అయినా ఇట్టే కలిసి పోతుందని అన్నారు.  ముఖ్యంగా అనుష్కతో ఏ నిర్మాత, దర్శకులు ఇప్పటి వరకు ఎలాంటి సమస్య అని చెప్పలేదు. రవితేజ, ఛార్మి, నేను.. అనుష్కను ‘అమ్మ’ అని పిలుస్తామని, ఆమెను కలిసినప్పుడల్లా బ్లెస్ తీసుకుంటామని చెప్పారు. ఆమె మంచితనం మాకు రావాలనే ఉద్దేశమే..  ‘చాలా మంచితనం, చాలా తెలివితేటలు.. అన్నీ కలిసిన ఓ కాంబినేషన్‘ అంటూ అనుష్కను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు సందడి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: