నందమూరి నటసింహం బాలకృష్ణ ఒక్కసారి ఏదైనా అనుకుంటే అది పూర్తయ్యే వరకూ నిద్రపోడట. అతని దబిడి దిబిడే మేనరిజం ఉట్టి పడేలా ప్రస్తుతం ఒక సంఘటన నిలుస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం యొక్క ఇంటర్వెల్ కు, ఇంటర్వెల్ సీక్వెన్స్ కి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల షూటింగ్ పూర్తయింది. అయితే ఇదే విషయాన్ని డైరెక్టర్ బోయపాటి శ్రీను తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. నిజానికి చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమా యొక్క ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. దీనికి కారణం బాలకృష్ణ యొక్క మెచ్చుకోదగ్గ డెడికేషన్ అని చెప్పుకోవచ్చు.





ఉగాది పండగ అనంతరం ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ వారణాసి లో జరుగుతుందని తెలుస్తుంది. తన తదుపరి చిత్రం కోసం బాలకృష్ణ గుండు కొట్టించుకొని మరీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారని తెలుస్తోంది. కేవలం ఈ సినిమా కోసం మాత్రమే 15 కిలోల బరువు తగ్గాడంటే అది మామూలు విషయం కాదు. వారణాసి రాయలసీమ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. రూలర్ సినిమాతో నిరాశ చెందిన అభిమానులు ఈ సారైనా బాలకృష్ణ బాగా ఎంటర్టైన్ చేసి హిట్టు తన సొంతం చేసుకుంటాడని అందరూ భావిస్తున్నారు.




ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ డబుల్ రోల్ చేయనున్నాడు. ఒకటి ఫ్యాక్షనిస్టు రోల్ కాగా, మరొకటి అఘోర పాత్ర. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... బాలకృష్ణ ఈ సినిమాలో కవల సోదరులుగా అంటే ట్విన్స్ గా కనిపించనున్నాడట. కేవలం కొన్ని నిమిషాల తేడాతో జన్మించిన ఇద్దరి జీవితాలని నవగ్రహాలు ఎలా ప్రభావితం చేస్తాయో చూపించనున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. పుట్టిన కొన్ని నెలల్లోనే వీళ్లిద్దరు ఎవరి దారి వారు వెళ్ళిపోతారు. ఐతే వీళ్లిద్దరు మళ్లీ ఎలా కలుసుకుంటారో ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. బాలయ్య అఘోరా అవతారాన్ని ఇంటర్వెల్ తర్వాత చూపిస్తాడని తెలుస్తుంది. అంజలి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: