తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బిగిల్ లో ఫుట్ బాల్ ప్లేయర్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది యువ నటి అమ్రితా అయ్యర్. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం కోలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ చిత్రం తెలుగులో విజిల్ గా విడుదలై విజయం సాధించడంతో అమ్రితా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యింది. ఈ ఒక్క సినిమా ఇప్పుడు అమ్రితా కు టాలీవుడ్ లో వరసగా అవకాశాలను తెచ్చిపెడుతుంది.
 
అందులో భాగంగా ప్రముఖ యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ '30రోజుల్లో ప్రేమించటం  ఎలా ?' తో హీరోయిన్ గా పరిచయమవుతుంది అమ్రితా. తెలుగులో ఆమె కు ఇదే మొదటి సినిమా కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ అవుతుంది. మార్చి 25న ఈచిత్రం విడుదలకానుంది. ఈసినిమా తోపాటు అమ్రితా ,ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెడ్ లో కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఇటీవలే షూటింగ్ కూడా కంప్లీట్ చేసింది. ఏప్రిల్ 9న ఈ చిత్రం విడుదలకానుంది. 
 
ఇక ఇప్పుడు తాజాగా మరో ఆఫర్ కొట్టేసింది ఈ బ్యూటీ. యంగ్ హీరో నాగశౌర్య, నూతన దర్శకుడు రాజా కొలుసు డైరెక్షన్ లో నటించనున్న చిత్రంలో అమ్రితా కథానాయికగా నటించనుందని సమాచారం. mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు ఈచిత్రాన్ని నిర్మించనున్నాడు. ప్రస్తుతం నాగ శౌర్య,లేడీ డైరెక్టర్ లక్ష్మి సౌజన్య డైరెక్షన్ లో నటిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్  నిర్మిస్తున్న ఈ చిత్రం సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.  వచ్చే నెలలో ఈ సినిమాను పూర్తి చేసి శౌర్య మే నుండి రాజా కొలుసు తో సినిమా ను మొదలుపెట్టనున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: