గడచిన రెండేళ్లుగా సరైన సక్సెస్ లేని బన్నీ, ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ అందుకుని మళ్ళి ఫామ్ లోకి వచ్చాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బన్నీ ఒక ట్రావెల్ ఏజెన్సీ కంపెనీ ఎంప్లాయ్ గా నటించాడు. ఇక దాని తరువాత ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆయన ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల నేపథ్యంలో ఈ సినిమా కథ, కథనాలు  సాగనున్నాయని, బన్నీ తో పాటు హీరోయిన్ రష్మిక కూడా తన కెరీర్ లో తొలిసారిగా పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తోందని సమాచారం. ఇకపోతే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర సంగతులను సినిమాలోని విలన్స్ లో ఒకరైన నటుడు రాజ్ దీపక్, నేడు ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా యొక్క కథ, కథనాలు మంచి కమర్షియల్ స్టైల్ లో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారని, తనతో పాటు విజయ్ సేతుపతి, జగపతి బాబు కూడా విలన్లుగా నటిస్తున్నారని, మా విలన్ల త్రయాన్ని హీరో బన్నీ ఎలా ఎదుర్కొన్నారు అనేది సినిమా యొక్క కీలక అంశం అని ఆయన అన్నారు. 

 

సుకుమార్ వర్కింగ్ స్టైల్ తనకు ఎంతో నచ్చిందని, హీరో బన్నీ తో పాటు హీరోయిన్ రష్మిక పాత్రలు సినిమాలో అదిరిపోతాయని రాజ్ దీపక్ అన్నారు. దీనితో సినిమా పై ఒక్కసారిగా బన్నీ ఫ్యాన్స్ లో మరింతగా అంచనాలు పెరిగాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా, ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: