బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూనే అడపా దడపా సినిమాల్లో కూడా నటించిన శ్యామల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంకర్ గా ఎన్నో షోలు చేసిన శ్యామల.. గతేడాది బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టంట్ గా పాల్గొని మంచి క్రేజ్ సంపాధించుకుంది. ఇక హోమ్లీ కనిపించే శ్యామలకి ఫ్యామిలీ ఆడియన్స్ లో చాలా మంది అభిమానులు ఉన్నారు. పెళ్లై పిల్లలున్న తర్వాత కూడా తన అందాన్ని కాపాడుకుంటూ యాంకర్‌గా కొన‌సాగుతోంది ఈ భామ‌. అలాగే ‘ఏం చెప్పారు శ్యామల గారూ’ అనే యూ ట్యూబ్ ఛానెల్ కూడా ర‌న్ చేస్తుంది ఈమె.

 

ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలను షేర్ చేస్తూ గంట మోగించండి బాబులూ అంటూ ప్రచారం కూడా చేసింది. అందుకు త‌గ్గ‌ట్టుగా ఈమెకు ప్రేక్ష‌కుల నుంచి బాగానే రెస్పోన్స్ వ‌చ్చింది. దీంతో మరింతగా తన యూట్యూబ్ ఛానల్‌ని జనంలోకి తీసుకుని వెళ్లేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది ఈమె. ఇక ఇదిలా ఉంటే.. ఈమె ఎందుకు మిగిలిన యాంకర్స్ మాదిరే గ్లామర్ షో ఎందుకు చేయడం లేదు.. అన్న‌ప్రశ్న ఈమెకు ఎదురైంది. దానికి శ్యామ‌ల ఓ ఇంటర్వ్యూలో ఆశ‌క్తిక‌ర స‌మాధాలు ఇచ్చింది. క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా ఇప్పటికే సినిమాలు చేసిన తాను.. ఎక్స్‌పోజింగ్ చేయకుండా అడ్డుకున్నది మాత్రం నెటిజన్స్ అంటూ సమాధానం చెప్పింది శ్యామల. 

 

అందరు యాంకర్లు మాదిరే తనకు కూడా ఎక్స్‌పోజింగ్ చేయాలని ఉంటుందని చెబుతుంది శ్యామల. అయితే కొందరు ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారని.. అందుకే ఆపేసానని క్లారిటీ ఇచ్చింది ఈమె. మోడ్రన్‌గా కనిపించాలని కాస్త గ్లామర్ షో చేయాలని ఎప్పుడైనా ప్రయత్నించినా కూడా వెంటనే ర‌క‌ర‌కాల కామెంట్స్‌తో తనను ఆడుకుంటున్నారని చెప్పుకొచ్చింది ఈమె. దేవుడా.. మీరు కూడా మొదలుపెట్టేశారా అంటూ తిడుతున్న‌వారూ ఉన్నార‌ని శ్యామ‌ల‌ తెలిపింది. కాబ‌ట్టి.. తనకు మోడ్రన్‌గా ఉండాలన్నా కూడా వాళ్ల కోరిక మేరకు ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉంటున్నానని చెబుతుంది ఈమె.

మరింత సమాచారం తెలుసుకోండి: