తెలుగు బుల్లితెరపై ఎంతగానో అలరిస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ఏడేళ్ల నుంచి కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే.  జబర్ధస్త్ కామెడీ షో లో మొదటి నుంచి జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, నటి, ఎమ్మెల్యే రోజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  ఈ మద్య నాగబాబు జీ తెలుగులో వస్తున్న అదిరింది కామెడీ షోకి జడ్జీగా వెళ్లారు.  ఆ సమయంలో జబర్ధస్త్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలో కూడా జబర్ధస్త్ పై ఎన్నో కాంప్లెంట్స్ వచ్చాయి.  కొంత మంది మనోభావాలు దెబ్బతినేలా ఇందులో స్కిట్స్ ఉన్నాయని.. మగవారు ఆడవేశంతో ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి.  ఏది ఏమైనా తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో ప్రతి వారం కొత్త స్కిట్స్ తో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు.

 

జబర్ధస్త్ కామెడీ షో అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది హైపర్ ఆది టీమ్.  హైపర్ ఆది వేసే కామెడీ పంచ్ లకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే.  ఈ టీమ్ లో రైజింగ్ రాజు, దొరబాబు కీలకమైన నటులు.  ఈ మద్య సెక్స్ రాకెట్ ఉదంతంలో జబర్దస్త్ కమెడియన్స్ దొరబాబుతో పాటు పరదేశీ కూడా పోలీసులకి దొరికిపోయారు. ఈ నేపథ్యంలో వీరిపై జబర్దస్త్ టీంతో పాటు కమెడియన్ ఆది సీరియస్ అయినట్టు సమాచారం. ఇక మల్లెమాల మేనేజ్ మెంట్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.  తాజాగా అదిరే అభి టీమ్ లో కామెడీ పండిస్తునన నవీణ్ ఈ విషయంపై స్పందించారు.

 

మనకు ఈ విషయంపై పెద్దగా తెలియదు. కొందరు చేస్తోన్న వ్యాఖ్యలు విని తెలుసుకుంటున్నాం.  వార్తల్లో చూస్తున్నానని దొరబాబు, పరదేశీ వ్యభిచారం కేసులో పట్టుబడ్డారని అంటున్నారు.  బబర్ధస్త్ లో వారు నాకు మంచి స్నేహితులు ఈ విషయం వారు క్లారిటీ ఇస్తే నేనేదైనా మాట్లాడగలను.. అంతే కాని నా సొంతానికి నేను ఏది పడితే అది చెప్పలేను కదా అన్నారు. వారొచ్చి చెబితే తెలుస్తుంది.. అప్పటివరకు దీనిపై నేను ఏమీ మాట్లాడాలని అనుకోవట్లేదు' అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: