టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు.  నీటి కోసం రైతులు పడుతున్న కష్టాలు.. వలస బాటల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు.  ఓ వైపు మెసేజ్ తో పాటు మెగాస్టర్ ఫ్యాన్స్ కోరుకునే ఎంట్రటైన్ మెంట్ చూపించారు. ఈ సినిమాల సూపర్ డూపర్ హిట్ కావడంతో తదుపరి సినిమా దేశభక్తి నేపథ్యంలో ‘సైరా నరసింహారెడ్డి’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి.  కానీ ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించలేకపోయింది.  దాంతో మరోసారి ఆయన ఎంట్రటైన్ మెంట్ కే ప్రాధాన్యత ఇస్తూ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీలో నటించాలన్న తపనతో ఉన్నారు. ఈ క్రమంలో కొరటాల శివ దర్శకత్యవంలో ఓ మూవీలో నటిస్తున్నారు.  దేవాలయాల్లో జరుగుతున్న అక్రమ దందాలపై ఈ మూవీ ఉండబోతున్నట్లు సమాచారం. ఇందులో మహేష్ బాబు కూడా నటిస్తున్నట్లు సమాచారం.

 

ఇందులో మెగాస్టార్ ని ఎలా చూడాలని ప్రేక్షకులు అనుకుంటున్నారో అంతకు మించి అన్నట్లు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.  ఈ మూవీ తర్వాత మెగాస్టార్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ తీయాడానికి సిద్దమయ్యారు.  అప్పుడే ఓ కథ కూడా ఆయన సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో మెగాస్టార్ కామెడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించారు.  ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ సైతం ఫుల్ లెన్త్ కామెడీ మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  

 

ఈ మూవీలో మెగాస్టార్ తనదైన కామెడీ మార్క్ చాటుకునేలా సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చంటబ్బాయ్ లాంటి కామెడీ ఎంట్రటైన్ మెంట్ త్రివిక్రమ్ అందిస్తే.. ఫ్యాన్స్ సంతోషాలకు అవధులు ఉండవు.   ఏడాది చివర్లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ వార్తతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: