తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన సూపర్ మూవీలో అక్కినేని నాగార్జున హీరోగా నటించగా, హీరోయిన్ గా అనుష్క శెట్టి నటించింది. సరిగ్గా ఈ భామ సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టి నిన్నటికి 15 ఏళ్ళు. అయితే.. ఈ సందర్భంగా ‘15 ఇయర్స్ ఆఫ్ అనుష్క శెట్టి’ పేరుతో ప్రత్యేకంగా హైదరాబాద్‌ లో ఒక ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసారు. కాగా., ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి అనుష్కతో తమకున్న అనుబంధాన్ని అక్కడి వారితో పంచుకున్నారు. కాగా., డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావుకు క్షమాపణలు చెప్పాడు.


అసలు క్షమాపణలు పూరీ ఎందుకు చెప్పాడంటే.. నా ఫస్ట్ సినిమా ‘బద్రి’ ఆ సినిమాకు కె.రాఘవేంద్రరావు ముఖ్యఅతిథిగా హాజరై.. కొబ్బరికాయ కొట్టి నన్ను ఆశీర్వదించారని పూరీ చెప్పారు. అప్పుడు రాఘవేంద్రరావు నీ పేరేంటి అని అడిగారు ? పూరీ జగన్నాథ్ సమాధానమిస్తూ.. సర్ నా పేరు జగన్ అని చెప్పాను. అపుడు రాఘవేంద్రరావు ఈ గడ్డం ఉంటే నువ్వు తమిళోడివి అనుకున్నానని ఆయన అన్నారట. అప్పుడు పూరీ.. సర్ మీకు కూడా గడ్డం ఉంది కదా.. మేము మీరు తమిళ వాళ్లని అనుకోవడం లేదు కదా సర్ అని సమాధానమిచ్చాడట. వెంటనే దర్శక ధీరుడు నీకు వెటకారం ఎక్కువైందని నన్ను సరదాగా తిట్టారని పూరీ పేర్కొన్నారు. ఆ తర్వాత చాలా రోజులకు నేను నిర్మించే ‘సూపర్’ సినిమా షూటింగ్ టైమ్‌ లో నాగార్జునని కలిసారు. ఆయన్ని చూసిన వెంటనే ఎందుకు వచ్చారు సర్ అని పూరీ అడిగితే.. ఆయన నాగార్జునతో సినిమా తీయబోతున్నాను ఆయన డేట్స్ కోసం వచ్చానన్నారు రాఘవేంద్రరావు.


పూరీ మాట్లాడుతూ.. అపుడే నేను ఐదో తరగతిలో ఉన్నపుడు మీ డైరెక్షన్‌లో వచ్చిన ‘అడవిరాముడు’ సినిమా చూశా. ఇపుడు నేను డైరెక్టర్ అయి సినిమా చేస్తున్న కూడా ఈ టైమ్‌ లో నాగార్జున డేట్స్ ఎందుకు సర్ అన్నాను. మీరు వెంటనే సినిమాలకు పులిస్టాప్ పెట్టి రిటైర్ అయిపోయిపోతే బాగుండు అని అన్నాడట పూరీ.. అప్పుడు ఆయన అన్న మాటలకు బాధపడుతూ క్షమాపణలు కోరుకున్నారు. వెంటనే రాఘవేంద్రరావు ఆయనను గుండెలకు హత్తుకున్నారు.  


ప్రస్తుతం అనుష్క నటించిన ‘నిశ్శబ్ధం’ సినిమా త్వరలో విడుదల కానుంది. తన మొదటి సినిమా అయిన సూపర్ లో నటించిన ఆమె.. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ఒక వైపు గ్లామర్ పాత్రలు చేసుకుంటూ.. మరోవైపు మహిళా ప్రాధాన్యత కూడిన చిత్రాలతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆమె కంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది స్వీటీ. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: