టాలీవుడ్ లో ప్రస్తుతం డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో పూజ హెగ్డే ఒకరు. వరుస విజయాలతో ఆమె దూసుకుపోతుంది. ఆమెతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రభాస్ తో, అఖిల్ తో రెండు సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలు పూర్తి అయిన వెంటనే మరో సినిమా చేయవద్దని బాలీవుడ్ కి వెళ్ళిపోవాలని పూజ భావిస్తున్నట్టు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఆమెకు టాలీవుడ్ మీద ఆసక్తి తగ్గిందని, బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు. 

 

త్వరలోనే ఆమె బాలీవుడ్ లో ఒక స్టార్ హీరోతో సినిమా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆ స్టార్ హీరోతో సినిమా కోసం ఆమె అవసరమైతే ఇతర హీరోల సినిమాలను కూడా పక్కన పెట్టే ఆలోచనలో ఉందని బాలీవుడ్ జనాలు కూడా అంటున్నారు. ఆ సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఎక్కువగా ఉండాలని, కాబట్టి ఆమె ఆ హీరో సినిమా కోసం సమయం ఎక్కువగా వెచ్చించే ప్రయత్నం చేస్తుందని టాక్ వినపడుతుంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా కోసం ఆమెను అడిగారట. 

 

కాని ఆమె మాత్రం అందుకు నో చెప్పింది అంటున్నారు. దీనికి సంబంధించి భారీ పారితోషికం ఇస్తామని నిర్మాణ సంస్థలు ఆఫర్ చేసినా ఆమె మాత్రం అందుకు సుముఖంగా లేదని, అంటున్నారు. ఇటీవల ఆమె నటించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అవ్వడంతో ఆమెది గోల్డెన్ లెగ్ అంటున్నారు. ఆ గోల్డెన్ లెగ్ ని బాలీవుడ్ కి కూడా తీసుకోవాలని భావిస్తున్నారట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆమె మాత్రం ఎక్కువగా ముంబై వెళ్తుందని అక్కడ ఎక్కువగా దర్శకులతో మాట్లాడుతుంది అంటున్నారు. ఏదైనా పూజ తలరాత మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: