టాలీవుడ్ లో రాజమౌళి కి ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ లో ఆయన సినిమాలు అన్నీ ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ ఒక్కటి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీనితో స్టార్ హీరోలు అందరూ ఆయనతో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రాజమౌళి, త్రివిక్రమ్ కి ఉన్న డిమాండ్ మరో దర్శకుడికి లేదు. వీరితో సినిమాలు చేయడానికి ఎక్కువగా పోటీ పడుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. 

 

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి చేసే సినిమా ఏదీ అనేది మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఇటీవల అతను మహేష్ బాబు తో చర్చలు జరిపారని అంటున్నారు. మహేష్ బాబు ఎప్పటి నుంచో రాజమౌళి తో సినిమా చెయ్యాలని చూస్తున్నాడు. దీనితో రాజమౌళి కూడా మహేష్ కోరిక మేరకు సినిమా చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తన తండ్రి రాజేంద్ర ప్రసాద్ కి కథ కూడా రెడీ చేయమని చెప్పారట. త్వరలోనే ఈ కథ మహేష్ ముందుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 

 

దీనిపై అధికారిక ప్రకటన వేసవిలో వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు రాజమౌళి డిమాండ్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఆయన డిమాండ్ ఈ రేంజ్ లో ఉందా అంటూ చర్చిస్తున్నారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఎవరితో చెయ్యాలి అనే దానిపై ఇప్పుడు సందిగ్దం లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన వంశీ పైడపల్లి తో సినిమా చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని కొన్ని రోజులు వార్తలు రాగా ఇప్పుడు పరుశురాం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: