టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఆయన నటించే సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని  తెలుగు రాష్ట్రంలో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు.  అలాంటిది ఆయన దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు.  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి మూవీ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.  కానీ ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో ఫెయిల్యూర్ కి డైరెక్టర్ త్రివిక్రమ్ నే నిందించారు మెగా ఫ్యాన్స్.  ఇదే సమయంలో ఏపిలో రాజకీయాలు రావడంతో పవన్ కళ్యాన్ ‘జనసేన’ పార్టీ తరుపు ప్రచారం చేయడం మొదలు పెట్టారు.  అంతే కాదు జనసేన పార్టీ తరుపు నుంచి ఆయన రెండు స్థానాలకు పోటీ చేసి ఓడిపోయారు.

 

 ఇప్పుడు మరోసారి వెండి తెరపై ఆయన జోరు కొనసాగించాలని చూస్తున్నారు.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ రిమేక్ గా వకీల్ సాబ్ మూవీలో నటిస్తున్నారు.  ఈ మూవీ తర్వాత ఆయన వెంటనే క్రిష్ దర్శకత్వంలో మరో మూవీలో నటించబోతున్న విషయం తెలిసిందే.  ఈ మూవీ మొగల్ పరిపాలన కాలం నాటిదని.. ఇందులో పవన్ ఓ గజదొంగలా కనిపిస్తాడని.. ప్రజల కోసం ధనవందుల ఆస్తులు కొల్లగొట్టే పాత్ర అని అంటున్నారు.  ఈ సినిమాను ఎ.ఎం.ర‌త్నం నిర్మిస్తున్నారు.

 

ప‌వ‌న్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీ తెర‌కెక్కిస్తున్నార‌ని స‌మాచారం.  అయితే ఈ మూవీ కోసం పవన్ కళ్యాన్ బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారట.  ఆ పాత్రకు అనుగుణంగా క్రిష్ సూచన మేరకు పవన్ ఫిట్ నెస్ విషయంలో గట్టిగానే కష్టపడుతున్నట్లు టాక్.  పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ఈ ఏడాది దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌.  ఈ మూవీలో గజదొంగగా పవన్ కళ్యాన్ ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: