టాలీవుడ్ లో ఈశ్వర్ మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయిన ప్రభాస్ తర్వాత యాక్షన్ భరిత సినిమాల్లో నటించారు. రాజమౌళి దర్శకత్వంలో ‘చత్రపతి’ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.  ఈ మూవీ తర్వాత ప్రభాస్ డార్లింగ్, మిర్చి మూవీస్ తో సంచలన విజయాలు అందుకున్నాడు.  ఇలా వరుస విజయాలు అందుకుంటున్న సమయంలనే మరోసారి రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాడు.  అంతే కాదు ప్రభాస్ ఐదేళ్ల కష్టానికి జాతీయ స్థాయిలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చకున్నాడు.  


బాహుబలి 2 తర్వాత ప్రభాస్సినిమా అయినా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.  ఈ నేపథ్యంలో గత ఏడాది సుజిత్ దర్శకత్వంలో ‘సాహెూ’ మూవీతో ప్రేక్షకుల ముందు వచ్చాడు.  కాకపోతే ఈ మూవీ అనుకున్న విజయం అందుకోలేకపోయింది.  దాంతో ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీపై ఫోకస్ పెట్టారు.  రాథా కృష్ణ దర్శకత్వంలో పూజా హగ్డే హీయిన్ గా ఓ మూవీలో నటిస్తున్నారు.  ఈ మూవీ ఫస్ట్ లుక్ ఉగాదికి రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


మూవీ తర్వాత ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తన తదుపరి చిత్రాన్ని రూపొందించబోతున్నాడని తెలిసింది. గతంలొ బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిత్య 369’ మూవీ ‘టైమ్ మిషన్’ నేపథ్యంలో అలరించింది.  ఇప్పుడు ఈ తరహాలోనే టైమ్ మిషన్ నేపథ్యంలో నాగ్ అశ్విన్ సినిమా రూపొందించబోతున్నారట. అంతే కాదు ఇది ప్రపంచ స్థాయిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. జయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మించనున్న ఈ చిత్రం కోసం ప్రభాస్‌ 70 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాట కూడా తీసుకుంటున్నాడు. 400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: