త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా మొదలు కాకుండానే.. ఆ తర్వాత తీసే సినిమాల గురించి చర్చ నడుస్తోంది. చిరంజీవిని డైరెక్ట్ చేస్తాడని కొందరంటే.. కాదు కాదు రామ్ చరణ్ తో సినిమా ఉంటుందంటున్నారు మరికొందరు. మాటల మాంత్రికుడు ఎవరితో తీసినా.. ఈయన మాత్రం మెగా ఫ్యామిలీ.. లేదంటే మహేశ్.. ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతున్నాడు. 

 

స్వయంవరంతో రచయితగా పరిచయమైన త్రివిక్రమ్ మాటల మాంత్రికుడిగా ఆకట్టుకున్నాడు. తరుణ్ తో తీసిన నువ్వేనువ్వేతో మెగాఫోన్ పట్టాడు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలకు మాటలు రాసినా.. డైరెక్టర్ గా స్థిరపడ్డాడు. కుర్రహీరో సినిమాతో మెగాఫోన్ పట్టిన త్రివిక్రమ్.. స్టార్స్ నే నమ్ముకున్నాడు. 

 

త్రివిక్రమ్ ఇప్పటి వరకు 11 సినిమాలకు డైరెక్ట్ చేస్తే.. రెండు తప్ప 9 సినిమాలను స్టార్స్ తో తీశాడు. నువ్వేనువ్వే.. అఆ మినహా అన్ని సినిమాల్లో కథానాయకులుగా స్టార్స్ నే ఎంచుకున్నాడు. త్వరలో డైరెక్ట్ చేయబోతున్న 12వ సినిమాలో ఎన్టీఆర్ హీరో. ఇక 13, 14 సినిమాల్లో కూడా.. పెద్ద హీరోల పేర్లే వినిపిస్తున్నాయి.

 

నువ్వే.. అఆ మాదిరి యంగ్ హీరోలను డైరెక్ట్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్ కనిపించడం లేదు. అల వైకుంఠపురములో 100కోట్ల మార్క్ దాటడమే కాదు.. నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో.. కుర్ర హీరోలను డైరెక్ట్ చేసే ఉద్దేశం త్రివిక్రమ్ కు ఉన్నట్టు లేదు. ఎన్టీఆర్ సినిమా తర్వాత లైన్ లో.. చిరంజీవి.. రామ్ చరణ్ ఉన్నాడు. జై చిరంజీవ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాశాడు. చిరంజీవితో ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ సినిమా కంటే ముందే ఎనౌన్స్ చేశారు. 

 

త్రివిక్రమ్ లిస్ట్ లో వెంకటేశ్ కూడా ఉన్నాడు. మల్లీశ్వరి, నువ్వునాకు నచ్చావ్, వాసు సినిమాకు మాటలు రాసిన త్రివిక్రమ్ వెంకటేశ్ ను డైరెక్ట్ చేయాలనుకున్నాడు. అయితే.. ఆయన లిస్ట్ లో క్రేజీ స్టార్స్ వచ్చి చేరడంతో.. వెంకటేశ్.. త్రివిక్రమ్ మూవీ అటకెక్కింది. సీనియర్ హీరోలే వెయిట్ లో ఉండగా.. యంగ్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇప్పట్లో లేనట్టే. 

మరింత సమాచారం తెలుసుకోండి: