రామ్ చరణ్ హీరోయిన్ రెండో పెళ్లికి రెడీ అవుతోంది. విడాకుల తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఇంత బిజీ లైఫ్ లోనూ ప్రేమలో పడింది. ప్రియుడితో ఫోటోలు వైరల్ కావడంతో డిలీట్ చేశారు. 

 

తెలుగులో బన్నీ, రామ్ చరణ్, నానితో నటించిన అమలాపాల్.. గ్లామర్ హీరోయిన్ గా కంటే నటిగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఆరేళ్ల క్రితం దర్శకుడు ఎ.ఎల్ విజయ్ ప్రేమలో పడి. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఈ బంధం రెండేళ్ల పాటు బాగానే సాగింది. మళ్లీ నటించాలనుకున్న అమలాపాల్ నిర్ణయంతో విబేధాలు తలుపుతట్టాయి. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. 

 

అమలాపాల్ తో విడిపోయిన తర్వాత రెండేళ్లు తిరగకుండా.. విజయ్ పెళ్లి చేసుకున్నాడు. ఇదే విషయంపై స్పందించమని అడిగితే.. తన జీవితంలో కూడా ఒకరున్నారని చెప్పింది అమలాపాల్. సీక్రెట్ గా రిలేషన్ షిప్ మెయిన్ టైన్ చేయడంతో అతనెవరో తెలియలేదు. ఎట్టకేలకు ముంబయి సింగర్ భవిందర్ సింగ్ అని తేలింది. 

 

అమలాపాల్ భవిందర్ సింగ్ ప్రేమాయణం సోషల్ మీడియాకు ఎక్కింది. భవిందర్ సింగ్ రీసెంట్ గా మొహం కనిపించకుండా.. ఓ అమ్మాయిని హత్తుకున్న ఫోటో పోస్ట్ చేశాడు. నా బేబీ ఊర్లో ఈస్టర్ పండుగ జరుపుకుంటానని పోస్ట్ చేశాడు. దీంతో ఆమె ఎవరు.. అమలా పాల్ కదూ అంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేయడంతో.. గతంలో అమలాపాల్ తో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో డిలీట్ చేశాడు. 

 

మొత్తానికి రామ్ చరణ్ హీరోయిన్ మరోసారి వార్తల్లోకెక్కింది. డైవోర్స్ తర్వాత కూడా సినిమాల్లో వరుస అవకాశాలు అందుకొని ప్రేక్షకులకు వినోదాలు పంచిన ఈ అమ్మడు మరోసారి పెళ్లికి సిద్ధమైనట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. మొదటి భర్తతో విడాకులు తీసుకుందో లేదో.. వెంటనే గతాన్ని మరిచిపోయి ఇంకో వ్యక్తితో ప్రేమలో పడిందట. అది పెళ్లికి దారితీసినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: