సాధారణంగా మనం మన చేతిలో కొంత డబ్బు ఉంటే దాన్ని మనం ఎలాంటి బిజినెస్ లు చేసి, దెంట్లో అయిన ఇన్వెస్ట్ చేసి లేదా ఇంకా ఎలా అయిన ఆ డబ్బును రెట్టింపు చేయాలనుకుంటాము. ఇలా అనుకోవటం, ఆలోచించటం అనేది మనిషి యొక్క సహజ గుణమనే చెప్పాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా..?? మనలాగే ఒక సెలబ్రిటీ కూడా ఇలా చేసి ఇప్పుడు బాధపడుతోంది. ఆమె ఎవరో కాదు మన జేజమ్మ అదేనండి అనుష్క శెట్టి.

 

 

భామ టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది. అసలు తెలుగు ఇండస్ట్రీలో తనకు ఎవరు సాటిలేరని ముద్ర వేసుకుంది. తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ ను దక్కించుకుంది ఈ స్వీటీ శెట్టి. మహిళా ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో నటిస్తూ.. తెలుగు అభిమానులందరి మనసును గెలుచుకుంది.

 

 

కాగా., అసలు విషయానికొస్తే.. గతంలో ఈ అమ్మడు హైదరబాద్ లోని ఒక ఏరియాలో స్థలాన్ని కొన్నది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉదృతం కావడంతో.. ప్రత్యేక రాష్ట్రం వస్తే, కొన్న భూముల ధరలు పడిపోతాయన్న భయంతో ఆ స్థలాలను అమ్మేసింది ఈమె.

 

 

అయితే.. అప్పుడు ఆ స్థలాల ధర రూ. 5 కోట్లకు పైగా పలికిందట. కానీ.. అప్పుడు ఆమె అమ్మిన స్థలాల ధరను చూసి అయ్యో అప్పుడు అనవసరంగా అమ్ముకున్నానని భదపడుతోందట అనుష్క. ఇప్పుడు దాని ధర అమాంతం పెరిగి రూ. 15 కోట్ల వరకూ పలుకుతోందట. దీంతో ఈ ఆమ్మడు తాను తొందరపడి తప్పుచేశానని అనుకుందట.

 

 

కేవలం ఈమె హైదరబాద్ లోనే కాదు ఏపీలోని విశాఖపట్నంలో కూడా ఇలాంటి పొరపాటే చేసిందట. గతంలో ఎప్పుడో విశాఖలో భూములను అనుష్క కొనుగోలు చేసింది. చంద్రబాబు సీఎం అయిన తరువాత, అమరావతి అభివృద్ధి చెందుతుందని భావించిన స్వీటీ విశాఖలో భూముల ధరలు పెద్దగా పెరగవని వాటిని కూడా అమ్మేసిందట. ఇప్పుడేమో తాను తొందరపడ్డానని అనుకుంటూ బాధపడుతోందట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: