యువసామ్రాట్ నాగార్జున రెండవ కుమారుడైన అక్కినేని అఖిల్, ఇండస్ట్రీకి వఛ్చి మూడేళ్లు అయినా ఇప్పటివరకు సరైన సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయారు. తన మొదటి సినిమా అఖిల్ పరాజయం పాలయింది. తరువాత వఛ్చిన హలో, మిస్టర్ మజ్ను సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోయాయి. తాజాగా అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. 

 

అఖిల్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ పై బన్నీ వాసు నిర్మిస్తుండగా యువ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సిద్ శ్రీరామ్ ఆలపించిన మనసా మనసా లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతలను విశేషంగా ఆకట్టుకోవడం జరిగింది. కాగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా మే లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇకపోతే ఈ సినిమా పూర్తి అయిన తరువాత ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు వంటి మంచి సక్సెస్ఫుల్ సినిమాని తీసిన వరుస విజయాల దర్శకుడు సరిలేరు అనిల్ రావిపూడితో అఖిల్ తన తదుపరి సినిమా చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. 

 

ఇటీవల ఒక వారం క్రితం అఖిల్ ని కలిసిన అనిల్, ఒక మంచి ఎంటర్టైనింగ్, యాక్షన్ స్టోరీ ని అతడికి వినిపించడం జరిగిందని, కాగా ఆ కథ అక్కినేని నాగార్జునకు కూడా ఎంతో బాగా నచ్చడంతో దానిని తమ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తీయడానికి నాగార్జున కూడా ఒప్పుకున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, నాగ్ ఫ్యాన్స్ మాత్రం ఇది నిజం అయితే, అఖిల్ కి కమర్షియల్ గా మంచి సక్సెస్ వస్తుందని, అందువలన అనిల్ తో ఒక సినిమా చేయాలని కోరుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: