మాస్ మహారాజా రవితేజ కి వరుసగా భారీ ఫ్లాప్స్ వచ్చి పడుతున్నాయి. ఆ మధ్య అనిల్ రావుపూడి ఇచ్చిన రాజా ది గ్రేట్ సినిమా సక్సస్ తర్వాత మళ్ళీ మాస్ రాజా కి హిట్ అన్నది దక్కలేదు. నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా ఇలా ఏ సినిమా మాస్ రాజా కి చుక్కలే చూపించాయి. అసలు రవి తేజ ఎనర్జీ కి తగ్గ సినిమా నే పడకపోవడం ఆశ్చర్యకరం. అంతేకాదు ఆయన కి వచ్చిన ప్రతీ సినిమా పరమ రొటీన్ గా ఉండటం మరో కామెడి విషయం. ఒక్క రాజా ది గ్రేట్ మాత్రమే కాస్త విభిన్నంగా ఉండటం మంచి కామెడీ తోడవ్వడం తో సినిమా మంచి సక్సస్ ని అందుకుంది. ఇక మంచి ఎక్స్పరిమెంట్ అనుకున్న డిస్కో రాజా కూడా ఘోరంగా ఫ్లాపయింది.

 

అయినా అవేమి పట్టించుకోకుండా వరుసగా సినిమాలని కమిటవుతూ కెరీర్లో స్పీడ్ పెంచారు. తాజా గా రవితేజ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. స్టార్ రైటర్ గా ఎన్నో హిట్ సినిమాలకు కథ అందించిన వక్కంతం వంశీ దర్శకత్వంలో రవితేజ నెక్స్ట్ సినిమాకి కమిటయ్యాడని తాజా సమాచారం. గత సంవత్సరం వక్కంతం వంశీ అల్లు అర్జున్ తో తెరకెక్కించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో డైరెక్టర్ గా మారాడు. కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.

 

బన్నీ కూడా ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అయితే విమర్శకుల ప్రశంసలు దక్కాయి గాని సినిమా కమర్షియల్ గా మాత్రం అంతగా సక్సస్ ని సాధించలేదు. ఇక తాజాగా వక్కంతం వంశీ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో తయారు చేసిన కథ తో మాస్ రాజా ని ఇంప్రెస్ చేశాడట. అందుకే రవితేజ వక్కంతం వంశీ కి డేట్స్ ఇచ్చాడని అంటున్నారు. ఇక గతంలో రవితేజ హీరోగా నటించిన కొన్ని సూపర్ హిట్ సినిమాలకి సినిమాలకు వంశీ రచయితగా పని చేశారు. 

 

అయితే రవితేజ వక్కంతం వంశీ కాంబినేషన్ లో సినిమా అనగానే కొంతమంది రవితేజ కి వద్దు అన్నట్టుగా చెబుతున్నారట. ఎవరైనా బాగా ఫాం లో ఉన్న డైరెక్టర్ తో సినిమా చేయమని సలహా ఇస్తున్నారట. అందుకు రెండు కారణాలని చెబుతున్నారట కూడా. వాటిలో ఒకటి వక్కంతం వంశీకి మొదటి సినిమా ఫ్లాప్ గా మిగలడం. రెండవది ప్రస్తుతం రవితేజ కి వరుసగా ఫ్లాప్స్ వస్తుండటం.

 

దీంతో ఇలాంటి టైం లో ఈ ఎక్స్పరిమెంట్స్ ఎందుకు అంటున్నారట. ఒకవేళ సినిమా చేసి అది గనక తేడా కొడితే మాస్ రాజా కి ఉన్న యాంటి ఫ్యాన్స్ ఘోరంగా ఆడేసుకుంటారని చెబుతున్నారట. ఒకరకంగా చూస్తే ఇది నిజమే. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన డిస్కో రాజా విషయంలో మాస్ రాజా ని ఒక ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: