‘సైరా’ మూవీ బాలీవుడ్ లో చెప్పుకోతగ్గ విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ బాలీవుడ్ మీడియాలో ఇప్పటికీ చిరంజీవి పై అనేక వార్తలు అదేవిధంగా ఆయన జీవితం పై కొన్ని ఆసక్తికర విషయాలు ప్రచురిస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో ఈమధ్య ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు చెందిన పత్రిక చిరంజీవితో చేసిన ఇంటర్వ్యూలో మెగా స్టార్ తనకు ఉన్న ఒక విచిత్రమైన అలవాటును బయటపెట్టి ఏకంగా బాలీవుడ్ మీడియాకు సాక్ ఇచ్చాడు. 


దాసరి నారాయణరావు చనిపోయిన తరువాత గత కొంత కాలంగా ఇండస్ట్రీకి సంబంధించిన చాల ఫంక్షన్స్ కు వెళుతున్న సందర్భంలో చిరంజీవికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురౌతోందట. తనను అతిధిగా పిలిచిన ఆ కార్యక్రమ నిర్వాహకులు లేదంటే ఆ ఫంక్షన్ కు వచ్చిన ఇతర సెలెబ్రెటీలు తనను ఆకాశంలోకి ఎత్తేస్తూ పొగడ్తలు కురిపిస్తున్నప్పుడు ఆ పొగడ్తలు విని తనకు ఆనందం కలిగినా ఆ ఫంక్షన్ తరువాత తన ఇంటికి వెళ్లి చిరంజీవి కొద్దిసేపు నేల పై పడుకుంటాడట.  


దీనికి కారణం ఆ పొగడ్తలు వలన తనకు ఎక్కడ లేనిపోని గర్వం వస్తుందో అన్న భయంతో పాటు తాను సాధించిన విజయాలలో తన కృషి కొంత వరకు మాత్రమే ఉన్నా ఆ విజయాల వెనుక తన సినిమాల కోసం పనిచేసిన లైట్ బాయ్ దగ్గర నుండి దర్శక నిర్మాతల వరకు వారు అందించిన సహకారం తనకు గుర్తుకు వచ్చి తాను అలా కొద్దిసేపు మౌనంగా నేల పై పడుకుంటాను అంటూ చిరంజీవి స్వయంగా ఈ ఆసక్తికర విషయాన్ని లీక్ చేసాడు. అంతేకాదు ఎలాంటి వ్యక్తికి అయినా పొగడ్తలు వింటే విజయగర్వం తలకెక్కుతుంది అని అంటూ అలాంటి గర్వం తనకు రాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను అంటూ చిరంజీవి చెప్పిన విషయాలు ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 


ఎంత ఎదిగినా ఇంకా ఒదిగి ఉండాలంటూ చిరంజీవి తరుచూ చెపుతూ ఉంటాడు. ఈ పాజిటివ్ లక్షణాల వలనేకాబోలు నాలుగు దశాబ్దాలు గడిచిపోయినా చిరంజీవి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మెగా స్టార్ గా కొనసాగుతూ ఆయన స్థానానికి దరిదాపులలో కూడ ఏ హీరో చేరుకోలేని ఉన్నత స్థానంలో కొనసాగుతున్నాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: