టాలీవుడ్ ఇండస్ట్రీలో అలనాటి సావిత్రి తర్వాత అంతటి ఖ్యాతి గడించిన వెటరన్ యాక్టరస్ సౌందర్య అని చెప్పాలి. సౌందర్య కూడా ఎటువంటి పాత్రనైనా సరే అవలీలగా పోషించేది. పాత్రలో లీనమై తనదైన శైలిలో నటనను కనబరిచేది. అంత మంచి యాక్టరెస్కి కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అంటున్నారు దర్శకులు కోడిరామకృష్ణ. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో సౌందర్యని ఇష్టపడని దర్శకులంటూ ఎవరూ లేరు. దర్శకులు మాత్రమే కాదు తన తోటి నటీనటులు కూడా ఆమెను ఎంతగానో అభిమానించేవారు. చక్కటి కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరైంది సౌందర్య. అయితే ఇంతకి కీర్తి ప్రతిష్టలు సంపాదించిన ఈమెకు కూడా కొన్ని మైనస్లు ఉన్నాయట. అవేమిటంటే కోడిరామకృష్ణ తీసే చిత్రాలన్నీ దాదాపుగా గ్రాఫిక్స్తో కూడుకున్న చిత్రాలను ఎక్కువగా తెరకెక్కిస్తూ ఉంటారు.
ఇక వాటి కోసం కాస్త ఓర్పు ఎక్కువగా కావలసి ఉంటుంది. అలాగే సరైన క్వాలిటీ వచ్చేంతవరకు కోడిరామకృష్ణ వదిలేవారు కాదట. దానికి కొన్ని సార్లు సౌందర్యకి విసుగు వచ్చి విసుక్కునేదట. కొంత వరకు ఇలాంటి చిత్రాల్లో ఆమెకు పేషన్స్ చాలా తక్కువగా ఉండేదని అలాగే సౌందర్యలో కొంత వరకు కన్ఫ్యూజ్ ఉండేదని ఆయన అనుష్క `అరుంధతి` చిత్రం ప్రమోషన్స్ సందర్భంలో ఓసారి అన్నారు. అందుకు ఆయన సౌందర్యతో అనుష్కను పోల్చి చెప్పారు. సౌందర్యకి మించి గొప్ప నటి అని అన్నారు. ఆమెకు ఉన్నంత ఓర్పు మరే హీరోయిన్లోనూ లేదని కోడిరామకృష్ణ తెలిపారు.
అనుష్కతో `అరుంధతి` చిత్రం తీసిన తర్వాత ఆయనకు ఆమె ఓర్పు, నటన అభినయం కనిపించింది. అందుకే అయనకు అనుష్క అంటే చాలా అభిమానం అన్నారు. అందువల్లనే ఆమె కోడిరామకృష్ణ దగ్గర సౌందర్యకి మించి ప్రేమాభిమానాలు ఆయన నుంచి అందుకుంది. ముఖ్యంగా ఏ పాత్రలో నటించేవారికైనా ఒక నటుడు లేక నటికి కావలసింది ప్రధానంగా ఓర్పు. అది అనుష్కలో పుష్కలంగా ఉంటుందట. ఏమాత్రం ఎక్కడా కూడా ఫ్రస్టేట్ అనేది అయ్యేది కాదట. అంతేకాక అర్ధరాత్రి రెండు, మూడు గంటలకు కూడా షాట్ రెఢీ అనగానే చక్కగా తనవరకు విజువలైజ్ చేసుకుని చూసుకుని మరీ వెళ్ళేదట.