త్రిష చిరంజీవి పక్కన ‘ఆచార్య’ మూవీలో నటిస్తోంది అంటూ వార్తలు రాగానే తిరిగి ఆమె హవా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మొదలై ప్రస్తుతం సీనియర్ హీరోలను వేదిస్తున్న హీరోయిన్స్ సమస్యకు త్రిష ఒక పరిష్కారం అవుతుంది అని భావించారు అంతా. మంచి నటిగా కూడ పేరున్న త్రిష ఎలాంటి పాత్రను అయినా నటించి మెప్పించ గలదు. తమిళ మూవీ ’96’ లో ఆమె చూపించిన అద్భుతమైన నటనకు అనేక ప్రశంసలతో పాటు అవార్డులు కూడ వచ్చాయి. 

 

ఇలాంటి పరిస్థితులలో ఆమెకు తిరిగి మెగా కాంపౌండ్ నుండి ‘ఆచార్య’ విషయమై ఆహ్వానం రావడంతో ఆ మూవీ పై చాల ఆశలు కూడ పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితులలో ఆమె ‘ఆచార్య’ మూవీ నుండి తప్పుకోవడానికి పరోక్షంగా రామ్ చరణ్ కారకుడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొదట్లో ఈ సినిమాలో త్రిషను నటించే విషయంలో ఒప్పించడానికి భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. 

 

అంతేకాదు ఈ మూవీలో చిరంజీవి పాత్రతో సమానంగా త్రిష పాత్ర ఉంటుంది అని కొరటాల చెప్పినట్లు టాక్. అయితే ఆ తరువాత ఈ మూవీ ప్రాజెక్ట్ లోకి చరణ్ రావడం మధ్యలో మహేష్ పై ఆలోచనలుఇలా రకరకాల కారణాల వల్ల ఈ మూవీ కథలో త్రిష పాత్ర పూర్తిగా తగ్గిపోయి డమ్మీ పాత్రగా మారిపోయింది అని టాక్. దీనికితోడు ఈ మూవీకి బడ్జెట్ పెరుగుతోంది మహేష్ ను కాకుండా తిరిగి చరణ్ వైపు యూటర్న్ తీసుకున్న నేపధ్యంలో చరణ్ పాత్రను బాగా పెంచమని చిరంజీవి కొరటాల కు చెప్పినట్లు టాక్. 

 

దీనితో చరణ్ పాత్ర పరిధి పెరిగి రెండు ఫైట్స్ రెండు సాంగ్స్ వరకు వెళ్లిందట. ఇందులో ఒక పాట తండ్రి కొడుకులపై ఉంటుందని అంటున్నారు. జరుగుతున్న ఈ పరిణామాలు త్రిషకు నచ్చక పోవడంతో త్రిష మెగా కాంపౌండ్ ఊహించని విధంగా ఈ డెవలప్మెంట్స్ త్రిషకి నచ్చలేదని అందువల్లనే ‘ఆచార్య’ మూవీలో తాను డమ్మీ పాత్రను చేయను అని మెగా కాంపౌండ్ కు ఊహించని షాక్ త్రిష ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: