సినిమా నడిపించేది కథ కథనాలు అయినా ఆడియెన్స్ కు అది చేరువయ్యేది మాత్రం మాటల ద్వారానే.. కొన్ని సినిమాలు డైలాగ్స్ తో బాగా గుర్తింపు తెచ్చుకుంటాయి. త్రివిక్రమ్ సినిమాల్లో మాటల ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఇక ఆ తర్వాత స్థానం సంపాదించుకున్నాడు మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా. గమ్యం నుండి సైరా నరసింహ రెడ్డి వరకు తన పెన్ను పదును ఏంటో చూపించిన సాయి మాధవ్ బుర్ర తెలుగులో టాప్ రైటర్ గా కొనసాగుతున్నాడు.

 

ఇక ఈ రైటర్ కు డైరక్షన్ ఛాన్స్ ఇస్తున్నాడట నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సెట్స్ మీద ఉన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు సాయి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. డైలాగ్ రైటర్ అయినా సాయి మాధవ్ బాలయ్యకి సరిపోయే ఓ మంచి కథ రాసుకున్నాడట. ఈమధ్యనే బాలకృష్ణను కలిసి కథ వినిపించగా ఓకే అన్నట్టు తెలుస్తుంది.

 

టాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశం ఇవ్వడంలో ముందుండే బాలయ్య సాయి మాధవ్ ను డైరక్టర్ గా పరిచయం చేయాలని చూస్తున్నాడు. సాయి మాధవ్ కు ఎలాగూ డైలాగ్స్ మీద మంచి పట్టు ఉంది కాబట్టి మంచి కథ రాసుకుంటే మాత్రం ఇక సినిమా సూపర్ హిట్ అన్నట్టే. బోయపాటి శ్రీను సినిమా పూర్తయ్యే లోగా ఈ సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట.  మరి బాలకృష్ణ కోసం సాయి మాధవ్ ఎలాంటి కథ రాశాడు.. ఈ ప్రాజెక్ట్ కు నిర్మాతలు ఎవరు. ఎంత బడ్జెట్ లో ఈ సినిమా నిర్మిస్తారు అన్న వివారాలు త్వరలో తెలుస్తాయి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: