తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యోగా టీచర్ గా ఉన్న అనుష్కని... దర్శకుడు పూరి జగన్నాథ్ నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశాడు. మొదటి సినిమాతోనే తన క్యూట్ క్యూట్ అందాలతో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ అమ్మడు. ఇక అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆరడుగుల అందాల ముద్దుగుమ్మ ను చూడని తెలుగు ప్రేక్షకులు అనుష్క ని చూసి మనసు పారేసుకున్నారు. ఇక మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించడంతో అనుష్క కెరీర్ కి బాగా కలిసి వచ్చింది. ఇక అనుష్క అందం అభినయం కూడా దర్శక నిర్మాతలు బాగా ఆకర్షించింది. దీంతో వరుస  అవకాశాలను అందిపుచ్చుకుని ఈ అమ్మడు. 

 

 

 ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సరసన కూడా నటించింది . అయితే అనుష్క ఎంత మంచి నటి అన్నది  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదైనా పాత్ర ఇస్తే  అందులో జీవిస్తుంది. అయితే కేవలం నటన పరంగానే కాదు ఓ వ్యక్తి పరంగా కూడా అనుష్క ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం అనుష్క నిశ్శబ్దం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుష్క మంచితనం గురించి ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. 

 

 

 ఆయన జార్జియా కు సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్ళిన సమయంలో ఒక డ్రైవర్ తమకు కేర్ టేకర్ గా ఉన్నాడని తాము వెళ్తున్న సమయంలో మేము ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పగానే మీకు స్వీటీ తెలుసా అని అడిగాడు అంటూ ఆయన తెలిపారు. మాకు తెలుసు మీకెలా తెలుసు అని అడగగా.. గతంలో ఓ తమిళ సినిమా చేస్తున్న సమయంలో స్వీటీ మూడునెల్ల పాటు  జార్జియాలో షూటింగ్లో పాల్గొన్న సమయంలో అనుష్కకు కేర్ టేకర్  గా ఆ వ్యక్తి ఉండేవాడట.. ఇక వారిద్దరి మధ్య మంచి స్నేహ బంధం కూడా ఏర్పడిందట. అయితే కొన్నాళ్ల తర్వాత అతను కార్ డ్రైవర్ గా  రాకపోవడంతో ఏం జరిగింది అని ప్రశ్నించగా.. అతని కార్  ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లారని చెప్పడంతో సదరు వ్యక్తిని పిలిపించి డబ్బులు ఇచ్చి కార్ ను  తెచ్చుకోమని చెప్పిందట స్వీటీ. అప్పటి నుంచి తాము స్వీటీ నీ ఎంతగానో ఆరాధిస్తాము అని ఏడ్చేశాడట ఆ కార్ డ్రైవర్ అన్నాడట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఎంత మంచి మనసున్న వ్యక్తి అన్నది .

మరింత సమాచారం తెలుసుకోండి: