తెలుగుతో పాటు తమిళ్ లో ఏకకాలంలో తన హవా చూపించిన స్టార్ హీరోయిన్ త్రిష. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లవుతోంది. ఇప్పటికీ అదే అందం, గ్లామర్ త్రిష సొంతం. కొన్నేళ్లుగా స్టార్ డమ్ లేకపోయినా త్రిషకు ఆఫర్లు తగ్గలేదు. తమిళ్ లో సినిమాలున్నాయి కానీ.. తెలుగులో ఆమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పక్కన మెయిన్ హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కెరీర్ ఎండింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అవకాశం వస్తే ఎగిరిగంతేసి సినిమా చేస్తారు. కానీ.. త్రిష మాత్రం నిర్మొహమాటంగా ఆ ఆఫర్ ను తిరస్కరించింది.

 

 

త్రిష నిర్ణయం తెలుగు సినిమా ఇండస్ట్రీకే బిగ్ షాక్ అని చెప్పాలి. సినిమాలో పాత్ర ఇంపార్టెన్స్ సరిగా లేకపోవడంతో చేయడం లేదని బాహాటంగా చెప్పేసింది. దీంతో త్రిషపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ టైమ్ అవకాశం రావడమే గొప్ప.. అదీ మెగాస్టార్ చిరంజీవితో. కానీ ఈ క్యారెక్టర్ వల్ల తన కెరీర్ కు దెబ్బ అన్నట్టు ఆఫర్ ను తిరస్కరించడం అర్ధం కాని విషయం. రజినీకాంత్ పెటాలో అసలేమాత్రం ఇంపార్టెన్స్ లేని చేసిన క్యారెక్టర్ కంటేనా.. అంటూ  మెగా అభిమానులు సోషల్ మీడియాలో త్రిషను ఆడుకుంటున్నారు. ఆమధ్య తమిళ్ సామి2 లో కూడా ఇలాగే సినిమా చేస్తానంటూ ఆఖరి నిముషంలో సినిమా చేయనని చెప్పేసింది.

 

 

ఏజ్ పెరిగినా త్రిషలో ఈ పొగరు ఇంకా తగ్గలేదు అంటే నెటిజన్లు మండిపడుతున్నారు. 2003లో నీ మనసు నాకు తెలుసు అనే ద్విబాషా సినిమాతో తెరంగేట్రం చేసిన త్రిష ఓ దశలో టాలీవుడ్, కోలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఏలేసింది. ప్రస్తుతం అమ్మడికి అందం ఉన్నా సినిమాలు లేవు. దీంతో ఇక త్రిషకు తెలుగులో తలుపులు మూసుకున్నట్టే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: