బాలీవుడ్‌ హాట్ బ్యూటీ కరీనా కపూర్‌ తన సినిమాలతో ఎంత ఫేమస్‌ అయ్యిందో.. అభిమానులతో తన రూడ్‌ బిహేవియర్‌ కారణంగానూ అంతే ఫేమస్‌. తాజాగా అలాంటి సంఘటనే మరోసారి జరిగింది. ముంబై, బాంద్రాలోని ఫార్చూన్‌ హైట్స్‌ లో నివాసముండే కరీనా, ఇటీవల తన స్నేహితురాళ్లు అమృతా అరోరా, సోహా అలీఖాన్‌లను కలిసేందుకు వారుండే చోటికి వెళ్లింది. కరీనా సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం తన తనయుడు తైమూర్‌ అలీఖాన్‌ను అమృత వాళ్ల ఇంట్లో వదిలిపెట్టి వచ్చేందుకు కరీనా అక్కడి వెళ్లిందట.

 

అయితే అదే సమయంలో అక్కడ ఉన్న ఓ మహిళా అభిమాని కరీనాలో ఫోటో దిగేందుకు ఉత్సాహం కనబరిచింది. బిల్డింగ్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో పక్కనే ఉన్న అభిమాని ఆమెను పదే పదే సెల్పీ కావాలని అడగటంతో కరీనా ఆమెపై మండిపడింది. కాస్త గట్టిగానే ఆమెకు వార్నింగ్‌ ఇచ్చింది. తరువాత కాస్త కూల్‌ అయిన కరీనా ముభావంగానే ఓ ఫోటోకు పోజ్‌ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదంత వీడియో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్‌గా మారింది.

 

తాజాగా అంగ్రేజీ మీడియం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిది కరీనా కపూర్‌. ఈ సినిమాలో ఇర్ఫాన్‌ ఖాన్‌, రాధిక మదన్‌, కికు శ్రద్దా, డింపుల్‌ కపాడియాలు కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలో నటిస్తోంది కరీనా.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#taimuralikhan after playing holi today ❤ #saifalikhan #kareenakapoorkhan #viralbahayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

మరింత సమాచారం తెలుసుకోండి: